Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ కార్యదర్శి వెల్లడి
న్యూఢిల్లీ: పండగ సీజన్లో పన్నుల వసూళ్లను మరింత పెంచు కోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే అక్టోబర్లో కనీసం రూ.1.50 లక్షల కోట్ల పైనే పన్ను వసూళ్లు నమోదు కావొచ్చని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలల్లో జిఎస్టి వసూళ్లు సగటున రూ.1.4 లక్షల కోట్ల స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన ఆగస్ట్లో 28 శాతం పెరిగి రూ.1.43 లక్షల కోట్లు పన్నులు వసూళ్లయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలో మాత్రమే రూ.1.5 లక్షల కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి.