Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు భారత మార్కెట్లను కుదేలు చేశాయి. వారాంతం సెషన్లో సూచీలు ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతికూలతలలోనే ట్రేడింగ్ అయ్యాయి. శుక్రవారం సెషన్లో ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 1093 పాయింట్లు లేదా 1.82 శాతం పతనమై 58,841కి పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 1,257 పాయింట్లు క్షీణించింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 17,530 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగితా సూచీలన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఫిచ్ లాంటి అంతర్జాతీయ ఎజెన్సీలు భారత వృద్థి రేటు అంచనాలకు కోత పెట్టడం మార్కెట్లకు రుచించలేదు. అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చనే సంకేతాలు అమ్మకాలకు దారి తీశాయి. భారత్లో నమోదవుతున్న హెచ్చు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బిఐ తదుపరి సమీక్షాలో వడ్డీ రేట్లను పెంచనుందన్న మోర్గాన్ స్టాన్లే అంచనాలు మార్కెట్లపై ప్రతికూలతను పెంచింది.