Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
న్యూఢిల్లీ : వచ్చే ఏడాదిలో మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ''పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో ఏకకాలంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని.. రేట్ల పెంపుతో రుణాలను మరింత భారం గా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ.. ఇదే సమ యంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది' అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రపంచంలోనే మూడు బలమైన ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, చైనా, యూరోల వృద్థి నెమ్మదించిందని తెలిపింది. ప్రపంచ వృద్థి రేటు శరవేగంగా పడిపోతుందని, మున్ముందు మరింత క్షీణిస్తే పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ హెచ్చరించారు. కరోనా ముందు నాటి స్థాయికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు సరిపోవన్నారు. కొవిడ్కు ముందుతో పోలిస్తే 2023లో ప్రపంచ ద్రవ్యోల్బణం రెట్టింపై ఐదు శాతానికి చేరుతుందని వ్యాఖ్యానించారు.