Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం
- నేడు రూ.12.40 లక్షల కోట్ల సంపద
- 2014లో రూ.50వేల కోట్ల లోపే
- అమెజాన్ జెప్ బెజోస్ను వెనక్కి నెట్టిన గౌతమ్
న్యూఢిల్లీ : ప్రధానీ మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ సంపద రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా అదానీ అవతరించా రు. కరోనా కాలం, ఆ తర్వాత కూడా భారత్లో తీవ్ర ఆర్థిక అసమానత లు పెరగ్గా.. ఆకలి సూచీలోనూ అట్టుడుగు స్థాయికి దిగజారింది. ఇదే సమయంలో అదానీ సంపద మాత్రం ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోయింది. ఫోర్బ్స్ రియల్టైం డేటా ప్రకారం.. శుక్రవారం నాటికి అదానీ సంపద రూ.12.41 లక్షల కోట్లకు ఎగిసింది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ను వెనక్కి నెట్టారు. బెజోస్ సంపద రూ.11.94 లక్షల కోట్ల (149.7 బిలియన్ డాలర్లు)కు తగ్గడంతో నాలుగో స్థానంలోకి జారారు. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ రూ.21.80 లక్షల కోట్ల (273.5 బిలియన్ డాలర్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇటీవలే ఫ్రాన్స్కు చెందిన లూయిస్ విట్టాన్ ఓనర్ బెర్నార్డ్ అర్నాల్ట్ను కూడా అదానీ దాటేశారు.
ప్రస్తుతం అర్నాల్డ్ సంపద రూ.12.35 లక్షల కోట్ల (155 బిలియన్ డాలర్లు)తో మూడో స్థానంలోకి వచ్చారు. రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేష్ అంబానీ రూ.7.33 లక్షల కోట్ల(92 బిలి యన్ల డాలర్ల)తో 8వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అదానీ సంపద 72 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.73 లక్షల కోట్లు)కు పైగా ఎగి సింది. అదానీ కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి తొలుత వజ్రాల ట్రేడింగ్ చేశారు. అనంతరం బొగ్గు వ్యాపారాన్ని ప్రారం భించారు. ఇక మోడీ సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సంపద, పెట్టుబడులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎనిమిదేళ్ల క్రితం అదానీ సంపద రూ. రూ.50వేల కోట్లు లోపులోనే ఉంది. అధికార పార్టీ బలంతో అదానీ కొత్త కంపెనీలు స్థాపించడం, పలు రంగాల్లోని కంపెనీలను వరుసగా స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. గత అయిదేళ్లలోనే విమానాశ్రయాలు, సిమెంటు, కాపర్ రిఫైనింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్ రిఫైనింగ్, రోడ్లు, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, సిటీ గ్యాస్ పంపిణీ తదితర రంగాల్లో విస్తరించారు.