Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్రిశాట్, సిమ్మిట్, క్రీడా సహకార సమన్వయముతో డా. రెడ్డీస్ ఫౌండేషన్ ఆతిథ్యం
- రేపు హైదరాబాద్ ఇక్రిశాట్ రౌండ్ టేబుల్
హైదరాబాద్: డా.రెడ్డీస్ ఫౌండేషన్, అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధనా సంస్థ (ICRISAT), అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ మెరుగుదల కేంద్రము (CIMMYT), ICAR-మెట్టభూముల వ్యవసాయం కొరకు కేంద్రీయ పరిశోధనా సంస్థ (CRIDA) ఉమ్మడిగా, ప్రపంచ, స్థానిక నిపుణుల యొక్క ఒక సలహా సంప్రదింపుల సదస్సును “సుస్థిరమైన పర్యావరణ వ్యవస్థ మరియు ఆర్థికస్థితి కొరకు పునరుత్పాదక వ్యవసాయము” పై హైదరాబాద్ ఇక్రిశాట్ యందు 2022, సెప్టెంబర్ 20 వ తేదీన ఉదయం 9.00 నుండి మొదలై నిర్వహిస్తున్నాయి. ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, పరోపకార స్వభావి మరియు డా. రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు అయిన డా.కల్లం అంజిరెడ్డిచే 1996లో డా. రెడ్డీస్ ఫౌండేషన్ (DRF) స్థాపించబడింది. మెరుగైన మరియు సుస్థిరమైన భవిష్యత్తును అన్వేషించడానికి డా. రెడ్డీ'స్ ఫౌండేషన్ (DRF) లక్ష్యంగా చేసుకొంది. అల్ప-ఆదాయ వర్గాల ప్రజల హుందాతనము, సంక్షేమమును పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది. తాము తెలుసుకున్న అంశాలను పంచుకోగలిగేలా, అనుసరణ వ్యూహాలపై విస్తరించి వివరించి, అర్థవంతమైన సమన్వయాలు, భాగస్వామ్యాలను వెలికితీయడానికి ఒక బహిరంగ చర్చ జరిపేలా నిపుణులను ప్రోత్సహించడం ఈ సదస్సు యొక్క ఉద్దేశ్యముగా ఉంది.
ఈ సదస్సులో చర్చించబోయే ప్రధాన అంశాల పైకీ, పునరుత్పాదక వ్యవసాయం కొరకు ఆచరణీయ పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు (ప్రత్యేకించి చిన్న భూకమతాల రైతులు లేదా సన్నకారు రైతుల కోసం), మనం అర్థవంతమైన భాగస్వామ్యాలలో సమన్వయం చేసుకొని కలిసి పని చేయగలిగితే రైతులు, అభివృద్ధికోసం తపిస్తున్న సంస్థలకు ప్రయోజనం కలిగేలా ఇండియాలో కార్బన్ మార్కెటింగ్ కోసం ఉన్న భారీ అవకాశాన్ని వెలికితీయడంతో పాటుగా కొన్ని క్షేత్ర స్థాయి సవాళ్ళను ఎలా పైకి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలి అనే అంశాలు చేరి ఉంటాయి.
డా. రెడ్డీ'స్ లేబొరేటరీస్ లిమిటెడ్ అనేది ఒక ప్రపంచస్థాయి ఔషధతయారీ కంపెనీ. సుస్థిరత్వములో 20 సంవత్సరాల నాయకత్వముతో, మూల విలువ, ధృఢమైన పర్యావరణ సుస్థిరత్వ లక్ష్యాలు కంపెనీ యొక్క వ్యూహము ఉద్దేశ్యానికి కేంద్రబిందువులుగా ఉన్నాయి. వ్యవస్థాపకులు డా. అంజి రెడ్డి ప్రధాన సూత్రమైన - ‘సమాజానికి తిరిగి ఇవ్వడం’ అనే ధ్యాయాన్ని అనుసరిస్తూ, కంపెనీ యొక్క సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఈ క్రింది నాలుగు విశాలమైన అంశాలను లక్ష్యంగా చేసుకుంటాయి: విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి, ఆరోగ్యము, పర్యావరణ సుస్థిరత్వము. ఈ సంవత్సరం, DRL తర్వాతి దశాబ్దం కోసం తన సుస్థిరత్వము, పర్యావరణ సుస్థిరత్వ లక్ష్యాలను (ESG) తాజాగా నిర్దేశించుకొంది. పర్యావరణ సంబంధిత సారధ్యమునకు కట్టుబడి ఉంటూ భారీ లక్ష్యాలను ఏర్పరచుకొని, ఈ కంపెనీ, 2030 నాటికి 100% పునరుత్పాదక విద్యుత్తును (RE100), 2030 నాటికి నేరుగా వచ్చే ఉద్గారాలలో కర్బన తటస్థత, 2030 నాటికి పరోక్ష కర్బన ఉద్గారాలలో 12.5% తగ్గింపును, 2025 నాటికి నీటి-సానుకూలతను ధ్యేయముగా చేసుకుంది. స్థోమతకు తగినదిగా చేయడం, నవ్యపోకడతో, ఇది 2030 నాటికి 1.5 బిలియన్ మంది ప్రజల జీవితాలను తట్టి మేల్కొలపడానికి తన ప్రస్తుత చేరువను విస్తరించే లక్ష్యాన్ని ఏర్పరచుకొంది. ఇది వైవిధ్యత, చేకూర్పు, అదేవిధంగా కార్పొరేట్ పరిపాలనకు అంతే సమానంగా దూకుడు కలిగి ఉంది.