Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఏ నాగేశ్వరన్ అంచనా
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్థి రేటు 7 శాతంగానే నమోదు కావొచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. ఇంతక్రితం జనవరిలో పేర్కొన్న 8 శాతంతో పోల్చితే ఒక్క శాతం తక్కువని తెలిపారు. ఆర్థిక సర్వేలో అయితే 8-8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. దీంతో పోల్చితే భారీ తగ్గుదలను నమోదు చేయనుంది. ''భారత్ ఇటీవల బ్రిటన్ దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇది గొప్ప మైలురాయి అయినప్పటికీ ఇది ఆశ్చర్యకరమేమీ కాదు'' అని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ వర్చ్యూవల్గా నాగేశ్వరన్ పేర్కొన్నారు. ''కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇంకా ప్రపంచంపై కనిపిస్తోంది. ఇది ఆర్థిక వద్ధికి విఘాతంగా మారాయి. ప్రస్తుత దశాబ్దం మొత్తం 7శాతం స్థిర వృద్ధిని నమోదు చేయనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం కోసం కషి చేసింది. ఇకపై 2030 వరకు ఆర్థిక సాధికారతపై దృష్టి సారించనుంది'' అని పేర్కొన్నారు.