Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ అగ్రగామి ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డీ హెచ్ఎల్ ఎక్స్ప్రెస్ నేడిక్కడ రేట్ల సవరణను ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2022తో పోలిస్తే భారతదేశంలో ఈ పెంపు 7.9% గా ఉండనుంది. అంతేగాకుండా ఓవర్ వెయిట్ పీసెస్ మరియు నాన్-స్టాకబుల్ పాలెట్స్ కు వరుసగా ఒక్కో పీస్కు రూ.7,250 మరియు ఒక్కో పాలెట్కు రూ.15,000 లకు సర్దుబాటు చేస్తారు. నెట్వర్క్ శక్తిసామర్థ్యాలు యధాపూర్వ స్థాయికి చేరుకునేందుకు, అత్యున్నత స్థాయి సేవా ప్రమాణాలు పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ సందర్భంగా డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఎస్విపి సౌత్ ఏషియా ఆర్ఎస్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘‘ఇప్పటి వరకూ 2022 అనేది హెచ్చుతగ్గులతో కూడిన మార్కెట్ స్థితిగతులతో అంతర్జాతీయ వ్యాపార సవాళ్లతో కూడిన మరో సంవత్సరంగా ఉంది. మేం మాత్రం అంతర్జాతీయంగా మా కస్టమర్లకు నిలకడతో కూడిన విశ్వసనీయ సేవలను అందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘వార్షిక ధర సర్దుబాటుతో మేం సుస్థిరదాయక, అంతర్జాతీయ స్థాయి కస్టమర్ సొల్యూషన్స్ ను అందించేందుకు వీలుగా మా మౌలిక వసతుల్లో, సాంకేతికతల్లో ఇన్వెస్ట్ చేయగలగు తాం. అత్యాధునిక విమానాలు, వాహనాలు, మా హబ్స్ విస్తరణ, పెరుగుతున్న కస్టమర్ డిమాండ్కు తగినట్లు గా గేట్ వేస్, పర్యావరణ అనుకూల విధానాల్లో పెట్టుబడులు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి మరింత సుస్థిరదాయక పరిష్కారాలు లాంటివన్నీ ఇందులో ఉన్నాయి’’ అని అన్నారు. డిహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ వార్షిక ప్రాతిపదికన రేట్లను సర్దుబాటు చేస్తుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ చలనశీలతలతో పాటుగా, నియంత్రణ, భద్రత చర్యలకు సంబంధించిన పాలనా వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. డీహెచ్ఎల్ తన సేవలను అందించే 220 కి పైగా దేశాలూ, భూభాగాల్లో ప్రతీ ఒక్కదానిలో కూడా క్రమం తప్పకుండా ఈ విధమైన చర్యలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అప్ డేట్ చేయబడుతాయి. స్థానిక పరి స్థితులపై ఆధారపడి, రేట్ల సర్దుబాట్లు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి. అందరు కస్టమర్లకు వర్తిస్తాయి.