Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోని 50 నగరాల్లోని ప్రైమ్ సభ్యులు పలు విభాగాల్లో 4 గంటల కన్నా తక్కువ సమయంలోనే వేలాది వస్తువులను ఉచిత డెలివరీ అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ తెలిపింది. చాలా ఉత్పత్తులను ఆర్డర్ చేసిన రోజునే వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది గత ఏడాదితో పోల్చితే 2.5 రెట్లు ఎక్కువ పిన్కోడ్లలో అందుబాటులో ఉండగా, 14 నగరాల నుంచి ఈ ఏడాది 50 నగరాలు, పట్టణాలకు విస్తరించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది.