Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకోని దలాల్ స్ట్రీట్
- సెనెక్స్ మరో 950 పాయింట్లు ఫట్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లోనూ నష్టపోయాయి. అంతర్జాతీ య ప్రతికూలాంశాలకు తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచొచ్చనే భయాలతో సోమవారం బీఎస్ఈ సెనెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 1000 పాయింట్లు కోల్పోయి.. తుదకు 953.70 లేదా 1.64 శాతం పతనమై 57,145కు జారింది. నాలుగు సెషన్లలో ఏకంగా 4.31 శాతం లేదా 2,574 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఈ సెషన్లలో మదుపర్ల సంపద ఏకంగా రూ.13.3 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనత, ఎఫ్ఐఐల అమ్మకాలు, రేట్ల పెంపు, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లకు ప్రతి కూలంగా మారాయి. ఈ నెల 28 నుంచి 30వ వరకు జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు పెరుగొచ్చనే అంచనాలు, విశ్లేషణలు మదుపర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, నెస్లే ఇండియా షేర్లు రాణించగా. మారుతీ, టాటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు అధిక నష్టాలను చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి.