Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌతమ్ అదానీ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే పదేండ్ల కాలంలో అదానీ గ్రూపు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మెన్ గౌతమ్ అదానీ తెలిపారు. న్యూ ఎనర్జీ, డిజిటల్ స్పేస్లో వ్యయాలు చేయనున్నామన్నారు. సింగపూర్లో జరిగిన గ్లోబల్ సీఈఓల కాన్ఫరెన్స్లో అదానీ మాట్లాడుతూ తమ మొత్తం పెట్టుబడిలో 70 శాతం ఎనర్జీ రంగంలోనే రానున్నాయన్నారు. అత్యధిక యువ జనాభా కలిగిన భారత్ రాబోయే 30 ఏండ్లపాటు ప్రపంచంపై గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపనుందన్నారు. ప్రస్తుత 20 గిగా వాట్ల పునరుత్పాదక పోర్ట్ ఫోలియోతో పాటు, 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని తీసుకొస్తామన్నారు. ఇది 100,000 హెక్టార్లలో విస్తరించి ఉంటుందని.. ఇది సింగపూర్ వైశాల్యం కంటే 1.4 రెట్లు ఎక్కువని అదానీ పేర్కొన్నారు.