Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: క్రౌడ్ఫండింగ్ ఇప్పుడు ఆధారపడతగిన అవకాశంగా ఎక్కువ మంది చూస్తున్నారిప్పుడు, దీనికి 67% మంది భారతీయులకు వైద్య భీమా లేకపోవడం ఓ కారణం అని మిలాప్ వెల్లడించింది. భీమా కవరేజీ ఉన్నప్పటికీ, వైద్యపరంగా ఖర్చులు చాలామందికి ఆర్థికంగా భారంగా ఉన్నాయి. ఆఖరకు ప్రభుత్వ భీమా పథకాలు పొందడం కూడా సామాన్య ప్రజలకు కష్టంగానే ఉందని మిలాప్ వెల్లడించింది.
ప్రతి ఏటా భారతదేశంలో 5.5 మిలియన్ల మంది అప్పుల్లో కూరుకుపోవడానికి ఊహించని వైద్య ఖర్చులు కారణమవుతున్నాయి. 2022 సంవత్సరంలోనే భారతదేశంలో ప్రజా ఆరోగ్యం కోసం జీడీపీలో దాదాపు 1.6% ఖర్చు చేసినట్లు అంచనా. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో భారతదేశంలో ఐసీయులో చేరిన రోగికి అయ్యే సరాసరి ఖర్చు రోజువారీ కార్మికుని 16 నెలల జీతంతో సమానంగా, అలాగే ఓ సగటు ఉద్యోగి 10 నెలల జీతంతో సమానంగా ఉందని మిలాప్ వెల్లడిచించింది.
ప్రజలు తరచుగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ను తమ చివరి అవకాశంగా వినియోగించుకుంటున్నారు. తద్వారా తమ వైద్య ఖర్చులకు చెల్లింపులనూ చేస్తున్నారని మిలాప్ వెల్లడించింది. మిలాప్ లాంటి వేదికలు నిధుల సేకరణ వేదికలుగా ఉపయోగపడటంతో పాటుగా దాతలలో విశ్వసనీయతనూ పొందుతున్నాయి. భారతదేశపు వైద్య సంరక్షణ వ్యవస్ధ భవిష్యత్ లో క్రౌడ్ ఫండింగ్కు ఎక్కువ అవకాశాలున్నాయని మిలాప్ వెల్లడిస్తూ తమ ప్లాట్ఫామ్పై 72 లక్షల ఖాతాలున్నాయని వెల్లడించింది. దేశీయంగా 46 లక్షల మంది దాతలు ఉండగా, విదేశాలలో 4 లక్షల మంది దాతల ఉన్నారని వెల్లడించింది.
‘‘డబ్బుకోసం స్నేహితులు, కుటుంబసభ్యులను అడిగి కష్టపడుతున్న ఎంతోమంది ఇప్పుడు క్రౌడ్ఫండింగ్ అతి సులభమైన అవకాశంగా గుర్తిస్తున్నారు. మా ప్లాట్ఫామ్ పారదర్శక, సౌకర్యవంతమైన అనుభవాలను అందించడంతో పాటుగా డిజిటల్గా దానం చేసే అవకాశం కల్పిస్తుంది’’ అని అనోజ్ విశ్వనాథన్, ప్రెసిడెంట్, కో–ఫౌండర్, మిలాప్ అన్నారు. మిలాప్పై 90% ఫండ్రైజర్లు వైద్య విభాగానికి చెందినవి ఉంటున్నాయని ఆయన వెల్లడించారు. ఎవరైనా మిలాప్పై ఫండ్ రైజర్ ప్రారంభించవచ్చంటూ ఇప్పటి వరకూ 2 లక్షల మెడికల్ క్యాంపెయ్లిను మిలాప్పై చేయడం ద్వారా 1250 కోట్ల రూపాయలను సేకరించి 3.8 లక్షలమందికి ప్రయోజనం కలిగించడం జరిగిందని మిలాప్ వెల్లడించింది.