Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఐసీసీలో మూడు రోజులు నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని మరింత ముందుకుతీసుకెళ్లే ఉద్దేశ్యంతో అక్టోబర్ 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2022 సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)లో భాగమైన సీఐఐ వెల్లడించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఈ సమావేశాలు జరుగుతాయని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మెన్, గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022 కో-ఛైర్మన్ సీ శేఖర్రెడ్డి తెలిపారు. గురువారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సీఐఐ, ఐజీబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ వెంకటగిరి, ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం ఆనంద్తో కలిసి ఆయన ఈ కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. గ్రీన్ బిల్డింగ్ ఉద్యమంలో 2070 నాటికి భారతదేశంలో నెట్ జీరో కమిషన్ చేరుకోవడానికి రోడ్మ్యాప్ సిద్ధమైనట్టు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్లో 80 మందికి పైగా విఖ్యాత స్పీకర్ల పాల్గొంటారనీ, వీరంతా నిర్మాణ వాతావరణంపై చర్చిస్తారని అన్నారు. మరో 20 మంది అంతర్జాతీయ స్పీకర్లు తమ అనుభవాలను పంచుకుంటారని వివరించారు. ఒకే తరహా ఆలోచనలు కలిగిన వ్యక్తులు, కంపెనీలు ఏకతాటిపైకి వచ్చేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తం 3వేల మంది ప్రతినిధులు, 10వేల మంది సందర్శకులు ఇక్కడి ఎక్స్పోకు హాజరవుతారని తెలిపారు. ఆర్కిటెక్ట్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్లానర్లు, కన్సల్టెంట్లు, కార్పోరేట్, ప్రభుత్వ అధికారులు, గ్రీన్ ప్రోడక్ట్ తయారీదారులు, ప్రొక్యూర్మెంట్ అధికారులు, ప్రాజెక్ట్ యజమానులు, ఐటీ కంపెనీలు, విద్యా సంస్ధలు, సాంకేతిక నిపుణులు ఈ మూడు రోజుల సదస్సులో భాగస్వాములు అవుతారని వెల్లడించారు.