Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత పర్యాటకులపై శ్రీలంక టూరిజం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని ముఖ్యమైన నగరాలలో 26 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకూ వరుసగా పలు రోడ్ షోలను నిర్వహించినట్లు ఆ దేశ టూరిజం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో ముగింపు రోడ్షోనూ ఏర్పాటు చేశారు. తమ ద్వైపాక్షిక, సాంస్కతిక సంబంధాలను ఇరు దేశాల మధ్య బలోపేతం చేయాలనేది కూడా మరో ఉద్దేశ్యమని పేర్కొన్నారు. శ్రీలంక సంక్షోభం తర్వాత ఇప్పుడు చెప్పుకోతగ్గ రీతిలో పర్యాటకులు వస్తున్నారని.. వీరిలో భారత్ నుంచే అధికంగా ఉంటున్నారని తెలిపింది.