Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : విజయవాడ, నగర పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా దుబాయ్ కు విమానాన్ని నడపనున్నారు. ఈ విషయాన్ని ఎయిర్ పెర్ట్ అడ్వైజరీ కమిటీ అధికారి వెల్లడించారు. ఈ నెల 29నుంచి దుబాయికి డైరెక్ట్ ప్లయిట్ సర్వీసును విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి నడపనున్నట్టు ప్రకటించారు. వారంలో రెండు విమాన సర్వీసులు విజయవాడ నుంచి అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు.