Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశ వ్యాప్తంగా శరద్ నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగను విభిన్న రకాలుగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలకు, తొమ్మిది రోజులు , తొమ్మిది రూపాలలో కనిపించే అమ్మవారిని పూజించే వైభవోపేత కాలమిది. దేశంలోని ప్రాంతాలను బట్టి అమ్మవారిని దర్శించే రూపాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు కానీ ఈ తొమ్మిది రోజులూ అపారమైన శక్తిసంతరిస్తుందని మాత్రం చాలా మంది నమ్ముతుంటారు.
ఈ రోజులలో కనిపించే రంగులు ప్రతీ ఒక్క దానికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పూజా కార్యక్రమాలలో ప్రత్యేకతనూ అది తీసుకువస్తుంది. తెలంగాణలో, సంస్కృతి, సంప్రదాయం, ప్రజలు, నమ్మకాలకు ప్రతీక అయిన నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత సైతం ఉంటుంది.
ఈ రోజులలో , అంటే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి విజయదశమి వరకూ తీసుకునే ఆహారం పట్ల అమిత జాగ్రత్త పడతారు. ఆహారం సిద్ధం చేసే తీరు, దానిని వినియోగించే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ తీసుకునే ఆహారం తీసుకోరు. ఆఖరకు వాడే పదార్ధాలు కూడా భిన్నంగా ఉంటాయి.
ఈ సీజన్లో లభించే పండ్లు , కూరగాయలకు ప్రత్యేకాదరణ ఉంటుంది. అదనంగా సంప్రదాయ ఆహారాలైనటువంటి సత్తు, రాజ్గిర, షింగారా ఆట , సాబుదానా కూడా వాడతారు. రోజూ తీసుకునే ఆహారం లేకపోవడం చేత పైన పేర్కొనబడిన పదార్థాలు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
దుర్గా పూజ రోజు అతిసరళమైన కిచూరి నుంచి విస్తృతశ్రేణి ఇలిష్ షోర్సీ (హిల్సా ఫిష్ కర్రీ) , దోయీ మచ్ (పెరుగు,ప్రత్యేక స్పైసెస్లో రోహు చేప వండడం) ఉంటాయి . విభిన్నమైన వెజిటేరియన్ వంటకాలు అయిన ఘుగిని (సెరల్స్తో చేస్తారు), అలూ పోస్తో వంటివి ఉంటాయి. రసగుల్లా లేకుండా ఈ భోజనమూ పూర్తి కాదు.
'పండుగ సమయాలలో భారతదేశంలో ఆయా ప్రాంతాల సాంస్కృతిక వైభవం మరింతగా కనిపిస్తుంది. తరతరాలుగా సంప్రదాయాలను పాటించడం వీటిలో మరింత ప్రత్యేకం` అని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా అన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ దసరా సంతోషం తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.