Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ తమ నూతన డీలర్షిప్ను హైదరాబాద్లో కూకట్పల్లి అంకుర్ మోటర్స్ తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. నగరంలో హీరోకు ఇది ఆరవ డీలర్షిప్ . నగరంలో విద్యుత్ ద్వి చక్రవాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను ఇవి తీర్చనున్నాయి. అంతేకాదు, భారతదేశంలో అత్యంత ధృడమైన గ్రీన్ మొబిలిటీ వ్యవస్థను సృష్టించాలనే హీరో, తమ ప్రయత్నాలను కొనసాగిస్తుంది.
ఈ షోరూమ్ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటోమొబైల్ కేంద్రం వద్ద ఉంది. తద్వారా వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా హీరో ఎలక్ట్రిక్ యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియో, ట్రిపుల్ ఎస్ (సేల్స్ , సర్వీస్, స్పేర్స్) సదుపాయాలను పొందగలరు. హీరో ఎలక్ట్రిక్ నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందిన ఈ డీలర్షిప్ ఉద్యోగులు అత్యంత నాణ్యమైన వినియోగదారుల అనుభవాలను అందించగలరు.ఈ డీలర్షిప్ 1008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 600 చదరపు అడుగుల సర్వీస్ కేంద్రం సైతం ఉంది.
హీరో ఎలక్ట్రిక్ సీఈఓ శ్రీ సోహిందర్ గిల్ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్లో మా ఆరవ డీలర్షిప్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. గ్రీన్ మొబిలిటీకి మారుతుండటానికి ఇది ఓ నిదర్శనంగా నిలువడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలను పటిష్టం చేయడంలోనూ తోడ్పడుతుంది. మా వృద్ధి వ్యూహంలో యాజమాన్య అనుభవాలను వృద్ధి చేయడం మరియు మా నెట్వర్క్ కార్యకలాపాలు విస్తరించడం అనేవి మా లక్ష్యాలను చేరుకోవడంలో అత్యంత కీలకమైన అంశాలు’’ అని అన్నారు.
శ్రీ అంకుర్ కపూర్, ప్రిన్సిపల్ డీలర్, కూకట్పల్లి అంకుర్ మోటర్స్ మాట్లాడుతూ ‘‘ మా నూతన డీలర్షిప్ కోసం హీరో ఎలక్ట్రిక్తో మరో మారు భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. గత కొద్ది సంవత్సరాలుగా , ఈవీ రంగంలో అసాధారణ వృద్ధిని మేము చూస్తున్నాము. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ద్విచక్ర వాహన బ్రాండ్లో ఒకటైన హీరో ఎలక్ట్రిక్తో మా భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకున్నాము. రాబోయే పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన విభాగంలో మార్కెట్లో వృద్ధి మరింతగా కనిపించనుందనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో 1500 టచ్ పాయిట్లను హీరో ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా తమ తయారీ సామర్థ్యం కూడా విస్తరించుకోనుంది. రాజస్తాన్లో త్వరలో రెండు మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభంకానున్న తమ గ్రీన్ ఫీల్డ్ కేంద్రం కోసం ఎంఓయు చేసుకున్నట్లుగా ఇటీవలనే వెల్లడించింది.