Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫండమెంటమ్ భాగస్వామ్యము నాయకత్వం క్రింద సీరీస్ B1 ఫండింగ్ రౌండులో కుకూ FM .8 మిలియన్ సమీకరణ చేసింది. కుకూ FM, ఇటీవలనే ప్రారంభించబడిన రెండవ ఫండ్ నుండి ఫండమెంటమ్ యొక్క మొదటి పెట్టుబడిని సూచిస్తోంది. కొత్త మదుపరులు ఫండమెంటమ్ మరియు పారామార్క్ తో పాటుగా, ప్రస్తుతం ఉన్న మదుపరులు క్రాఫ్టాన్ (KRAFTON), Inc, 3వన్4 క్యాపిటల్, వెర్టెక్స్, వెర్లిన్వెస్ట్ మరియు ఫౌండర్బ్యాక్ క్యాపిటల్ కూడా ఈ రౌండులో పాల్గొన్నారు. ఇది ఈ సంవత్సరం కుకూ FM యొక్క రెండవ నిధి సమీకరణగా ఉంది. ఈ సంవత్సరం మొదట్లో, గూగుల్ (Google), వెర్లిన్వెస్ట్ (Verlinvest) మరియు ఇతర పెట్టుబడిదారులు పాల్గొనగా క్రాఫ్టాన్ (KRAFTON),Inc. నాయకత్వంలో కుకూ FM .5 మిలియన్ నిధుల్ని సమీకరించింది.
కుకూ FM 'భారత్' వీక్షకులపై దృష్టి సారిస్తూ, తన కేటలాగ్ విస్తరించుకోవడానికి, తన కంటెంట్ క్రియేషన్ సానుకూల వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి మరియు శ్రోతలకు మరిన్ని భాషల ఎంపికలను అందించడానికి నిధులను వినియోగిస్తుంది. 2023 ఆఖరు నాటికి 10 మిలియన్+ చెల్లింపు చందాదారుల పటిష్ట పునాదిని సాధించడానికి కుకూ FM లక్ష్యంగా చేసుకుంటుంది.
ప్రతీక్ జైన్, ప్రిన్సిపాల్, ఫండమెంటమ్ భాగస్వామ్యము, ఇలా అన్నారు, “ఇండియా డిజిటైజేషన్ గమనము వివిధ రంగాల వ్యాప్తంగా అవకాశాలకు తెర తీసింది. కంటెంట్ సానుకూల వ్యవస్థ ప్రత్యేకించి ఇంటర్నెట్ వాడుకదారుల యొక్క సంఖ్య అతిశీఘ్రంగా ఎదుగుదల కావడం వల్ల లాభపడింది. తన 4-సంవత్సరాల ప్రయాణములో, కుకూ FM ఘనమైన ప్రాథమిక పునాదులు, బలమైన ధనసంపాదన నమూనా మరియు జాతీయ సృష్టికర్త-శ్రోత సమాజంతో తన వ్యాపారాన్ని నిర్మించుకొంది. కుకూ FM యొక్క డిజిటల్ - ఫస్ట్, సాంకేతిక-ఆధిపత్య విధానము, 'భారత్' వీక్షకులపై తన దృష్టిసారింపుతో మా పెట్టుబడి దృష్టిసారింపు లోనికి బాగా కుదురుబాటుగా ఉంటుంది. కుకూ FM ని ఒక ఇంటివాడుక పేరుగా చేయడానికి బిసు మరియు బృందముతో భాగస్వామ్యం వహించడం పట్ల మేము ఎంతో ఆనందిస్తున్నాము" అన్నారు.
పారామార్క్ వెంచర్స్ యొక్క వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ పార్టనర్ ఛున్సూ కిమ్, ఇలా అన్నారు, “కుకూ FM యొక్క ఎదుగుతున్న చందాదారు పునాది యొక్క ఘనమైన ఎదుగుదలతో మేము సంతృప్తి చెందుతున్నాము. స్థానికంగా రూపకల్పన చేయబడిన కంటెంటు కొరకు భారత్ వీక్షక శ్రోతల నెరవేరని కోరికలను నెరవేర్చడం మరియు చెల్లింపు చందాదారులుగా తర్జుమా చేసే అర్థవంతమైన వినియోగపు అలవాట్లను నేర్పించడం ద్వారా కంటెంట్ ద్రవ్యీకరణలో బృందం ఆధిపత్యం తీసుకుందని మేము నమ్ముతున్నాము. సుస్థిరమైన ఒక క్రియేటర్ సానుకూల వ్యవస్థను నిర్మించడానికి తన నిబద్ధతతో, ఇండియాలో అత్యంత ఆశాజనకంగా ఉన్న ఆడియో చోటులో కంపెనీ తన ఎదుగుదల ప్రయాణమును కొనసాగించడానికి గాను ఉత్తమ స్థాయిలో కుదురుబాటు చేయబడింది” అన్నారు.
2018 లో లాల్ చాంద్ బిసు, వికాస్ గోయల్, మరియు వినోద్ కుమార్ మీనా గారలచే స్థాపించబడిన కుకూ FM ప్రస్తుతం 1.5 మిలియన్ + చెల్లింపు చందాదారులతో భారతదేశం యొక్క అతిపెద్ద ఆడియో ప్లాట్ఫామ్ గా ఉంది. కుకూ FM ఒక కేటగరీ క్రియేటర్ గా ఉంది, ఇక్కడ 'భారత్' నుండి వాడుకదారులు ఆడియో విద్యావిషయక మరియు ఆకాంక్షిత కంటెంటు కొరకు చెల్లిస్తున్నారు. ఇది తన వాడుకదారులకు స్వాధీనతా కంటెంట్ సాధనాలను కూడా అందజేస్తోంది, వారు కంటెంటును రూపొందించి, వృద్ధి చేసి మరియు ప్లాట్ఫామ్ పైన పోస్టు చేయడానికి వీలు కలిగిస్తోంది. ఏడు భారతీయ భాషలను (హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం) తనలో చేర్చుకొని ప్లాట్ఫామ్ తన భాషాపరమైన అందజేతలను విస్తరించింది.
కుకూ FM సహ-వ్యవస్థాపకులు మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి లాల్ చాంద్ బిసు ప్రకారము, “మేము మా ప్రయాణములో ఒక భాగస్వామిగా ఫండమెంటమ్ ని కలిగి ఉండడం పట్ల ఎంతగానో ఆనందిస్తున్నాము. వారి 'వ్యవస్థాపకులు-మొదట' విధానము మాకు విలువైనదిగా నిరూపణ అయింది మరియు కుకూ FM యొక్క స్థాయి-పెంపుదలను వికసింపజేయడానికి బృందం యొక్క ఔత్సాహికవేత్త అనుభవాలను సానుకూలం చేసుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాము. కుకూ FM యొక్క ఎదుగుదల, ప్రీమియం, విశిష్ట మరియు సంలీనాత్మక డిజిటల్ ఆడియో అనుభవాల కొరకు భారతీయ శ్రోతల/వీక్షకుల ఆకాంక్షలను ప్రదర్శిస్తోంది. మేము టయర్ II మరియు టయర్ III నగరాలు, సెమీ-అర్బన్ మరియు గ్రామీణ విభాగాలలో ప్రాంతీయ భాషలలో కంటెంట్ కొరకు అతివేగంగా ఎదుగుతున్న ఆసక్తిని చూస్తూనే ఉన్నాము. భారత్ వీక్షకుల ఈ విభాగానికి చేయూతనిచ్చే ఒక బలమైన మరియు వైవిధ్యమైన క్రియేటర్ నెట్వర్క్ నిర్మించడం కొనసాగించాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము.”
ప్రస్తుతానికి, కుకూ FM ఆడియో బుక్స్, స్టోరీస్, బుక్ సారాంశాలు, కోర్సులు, మరియు పోడ్కాస్ట్ లతో సహా వివిధ ఫార్మాట్లలో 150 వేలకు పైగా గంటల కంటెంటుకు ఆతిథ్యమిస్తోంది, కంటెంటులో అత్యధిక భాగం ప్లాట్ఫామ్ కే ప్రత్యేకితమై ఉంటోంది. కుకూ FM యొక్క అందజేతలలో కల్పన మరియు కల్పనయేతర ఆడియో బుక్స్, వ్యక్తిగత ఫైనాన్స్, స్వయం-సహాయక విద్యా శీర్షికలు, వినోదము, వార్తలు, పురాణశాస్త్రం, ఆధ్యాత్మికత, అభ్యసనం మరియు స్ఫూర్తిదాయక కంటెంటుతో సహా ఇతర రకాల విస్తృత శ్రేణి సాధారణాంశాలు చేరి ఉన్నాయి.