Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతీయులు అందరికీ ఒకే సాధారణ లక్ష్యం కోసం సమగ్రమైన మంచి ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో, భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగుతున్న మరియు ఆరోగ్యం కోసం అత్యంత నమ్మకమైన సామాజిక చొరవ 9వ సంవత్సరంలో మళ్లీ వచ్చింది. ఆరోగ్యం మరియు పరిశుభ్రతలు గురించి ఈ కాంపైన్ ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధృవీకరించారు. పరిశుభ్రత ఆరోగ్యాలను ప్రోత్సహించడానికి 8 సంవత్సరాలు క్రితం మొదటిసారి బనేగా స్వచ్ఛ్ ఇండియాగా ఆరంభమైన ఇది కాంపైన్ బనేగా స్వాస్త్ ఇండియాగా పరివర్తనం చెందింది, పరిశుభ్రత ఆరోగ్యాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయనే గాంధీ ప్రకటనను ముందుకు తీసుకువెళ్లింది. ఆరోగ్యవంతమైన భారతదేశం ఏ విధంగా సుసంపన్న భారతదేశంగా మారుతుంది మంచి ఆరోగ్యం కోసం ఏ ఒక్క భారతీయుడు ఏ విధంగా వెనకబడి ఉండకూడదు, మంచి ఆరోగ్య పద్ధతులు, పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యాలు పై ఏటా ఇతివృత్తాలు తెలియచేస్తాయి. సీజన్ 9 ఇతివృత్తం లక్ష్య సంపూర్ణ్ స్వాస్త్య్ కా (ఆరోగ్యం యొక్క సంపూర్ణ లక్ష్యం), ప్రతి భారతీయుని యొక్క నేపధ్యాలతో సంబంధం లేకుండా సమగ్రమైన మంచి ఆరోగ్యం పై దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రతి భారతీయునికి మంచి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండటం మరియు ఆవిష్కరణ, సాంకేతికత, వైద్య సంరక్షణ అందుబాటులో ఉండటం కేంద్రీకరించబడిన స్వీయ-సంరక్షణలు ద్వారా 80 ఏళ్ల వయస్సు వరకు సగటు జీవిత కాలాన్ని మెరుగుపరచబడే విధంగా భవిష్యత్తును నిర్మించడానికి కృషి చేస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, డబ్ల్యూహెచ్ ఓ నుండి నిపుణులు, డాక్టర్స్, ఆవిష్కరణకర్తలు, కళాకారులు మరియు అత్యంతగా దాడులకు గురయ్యే ప్రజలకు సహాయం చేసే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు 12 గంటల టెలీథాన్ కు హాజరయ్యారు మరియు అందరికీ సమగ్రమైన ఆరోగ్య లక్ష్యాన్ని మనం ఏ విధంగా సాధించగలమో దృష్టి కేంద్రీకరించి కొత్త సంవత్సరం కాంపైన్ కు పునాది ఏర్పరిచారు.
ఈ సంభాషణలు మోహిత్ చౌహాన్, కైలాష్ ఖేర్, పాలక్ ముక్కల్, మైకా సింగ్, విశాల్ మిశ్రా ఆస్థా గిల్, ధర్మేష్ ఎలోండే గణేష్ ఆచార్య వంటి గౌరవనీయులైన కళాకారులు ద్వారా లైవ్ పెర్ఫార్మెన్సెస్ తో వ్యాపించాయి.
అనారోగ్యాన్ని కేవలం నయం చేయడమే కాకుండా నివారించే అవసరాన్ని కార్యక్రమం ప్రధానాంశంగా చూపించింది. మంచి ఆరోగ్యం పై ప్రాధాన్యతకి ఇది ప్రాధాన్యతనిచ్చింది, ఆరోగ్యం పై వాతావరణం మార్పు యొక్క ప్రభావాన్ని విశ్లేషించింది యుక్త వయస్సులో లైంగికపరమైన మరియ పునరుత్పత్తి ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను ఏ విధంగా మెరుగ్గా చర్చించాలో పరీక్షించింది. మహిళల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది, ఆరోగ్య టెక్ లో తదుపరి అతి పెద్ద నవీన అంశాలకు ప్రేక్షకులను పరిచయం చేసింది.
సామాజిక మార్పు చైతన్యం తీసుకురావడానికి ఒక శక్తిగా ఉండటానికి ఈ వార్షిక కార్యక్రమం కాంపైన్ లు పలు బహుమానాలు గెలుచుకున్నాయి.
అమితాబ్ బచ్చన్, కాంపైన్ అంబాసిడర్ ఇలా అన్నారు, "ఆరోగ్యవంతమైన భారతదేశం మన లక్ష్యం కావాలి.... సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ఇది కీలకమైనది. బనేగా స్వాస్త్ ఇండియా వంటి కార్యక్రమాలు మంచి ఆరోగ్యం పరిశుభ్రతలు గురించి చైతన్యాన్ని పెంచే దిశగా పని చేస్తాయి ఈ ఏడాది, గత 75 సంవత్సరాలలో ఆరోగ్యంలో పెను మార్పులు కలిగించిన వారి పై దృష్టి కేంద్రీకరించబడింది. గత కొద్ద సంవత్సరాలుగా హెల్త్ టెక్ ఎంతో ఆధునికంగా మారింది- దేశీయ సరసమైన వాక్సిన్స్ ను మనం తయారు చేయగలిగిన వాస్తవం భారతదేశానికి గల సామర్థ్యం గురించి ఎంతో చెబుతోంది. ఆరోగ్య సంరక్షణ అనేది సమీకృతంగా ఉండాలి ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి."
క్రిస్ లిక్ట్, ప్రెసిడెంట్ హెల్త్ &గ్లోబల్ ఛీఫ్ ఆఫీసర్, రెకిట్ ఇలా అన్నారు, "మా ఉత్పత్తులు మరియు వ్యాపారాన్ని మించిన సృజనాత్మకమైన సామాజి ప్రభావాన్ని సృష్టించడం అనేది పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిరంతరంగా అనుసరించడాన్ని కాపాడటానికి, నయం చేయడాని మరియు పోషించడానికి మా లక్ష్యాన్ని విస్తరించడానికి ఒక సహజమైన ప్రక్రియ. మేము సమాజాలు పై దీర్ఘకాలం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాం , యూఎన్ సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ (ఎస్ డీజీలు) ను అందించడానికి తోడ్పడతాము."
గౌరవ్ జైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రెకిట్- దక్షిణ ఆసియా ఇలా అన్నారు, "మంచి ఆరోగ్యం మరియు పరిశుభ్రతలు అందుబాటులో ఉండటం ప్రతి వ్యక్తి యొక్క హక్కు. అందరికీ మంచి ఆరోగ్యం మా లక్ష్యం. అంటే ప్రతి భారతీయుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించగలగాలి. వ్యక్తులుగా మరియు సమాజాలుగా మనం మెరుగైన శారీరక మరియు మానసిక సంక్షేమం పై దృష్టిసారిస్తే, మనం ' లక్ష్య్-సంపూర్ణ్ స్వాస్త్య్ కా' సాధించగలటంలో ఎలాంటి సందేహం లేదు."
రవి భట్నాగర్, డైరక్టర్- ఎక్స్ టర్నల్ అఫైర్స్ మరియు పార్ట్ నర్ షిప్స్, రెకిట్ - దక్షిణ ఆసియా ఇలా అన్నారు, "డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా వేదిక మార్పు కలిగించడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది మరియు అంతర్జాతీయంగా ఉన్న ప్రేక్షకులకు నిజంగా ప్రేరణ కలిగించిన విజయ గాథలను కూడా మనం సంబరం చేసుకోగలం. మేము ఎస్ డీజీ 17 ( భాగస్వాములు ) పై పని చేయడాన్ని విశ్వసిస్తాం మరియు ప్రతి భారతీయుడు ఆరోగ్యవంతమైన ' సహస్ర పూర్ణ చంద్రోదయంట (1000 పౌర్ణమిలు జీవించడం) జీవించేలా చేయడానికి సరైన ప్రభుత్వ, ప్రైవేట్ మరియు రోగి మిశ్రమం ద్వారా 'ఒక్కరు కూడా వదిలివేయబడకుండా ' నిర్థారిస్తాం."