Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:ఐటి సొల్యూషన్స్ సంస్థ వియం సాఫ్ట్వేర్ తమ అత్యం త అధునాతన డాటా పరిరక్షణ పరిష్కారాలను హైదరాబాద్ మార్కెట్కు పరిచయం చేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం ఇక్కడ వియం 'హౌప్ ఆన్ వియం- యువర్ జర్నీ టు మోడ్రన్ డాటా ప్రొటెక్షన్' (ఆధునిక డాటా రక్షణ దిశగా మీ ప్రయాణం) క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు తెలిపిం ది. దేశంలో ఇది తమ సంస్థకు తొలి మల్టీ సిటీ రోడ్ షో అని తెలిపింది. దీనిద్వారా వీయం భాగస్వాములు, వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుత డాటా ప్రొటెక్షన్కు సంబంధించి విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చలను చేయడం వీలవుతుందని తెలిపింది. వచ్చే వారం చెన్నరు, కొచ్చి, బెంగళూరులో ఈ క్యాంపెయిన్ను నిర్వహించనున్నట్లు పేర్కొంది.