Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల వేదిక బిట్డెస్క్తో కుదిరిగిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు పేయూ మాతృసంస్థ ప్రోసస్ ఎన్వి వెల్లడించింది. పలు షరతులకు లోబడి 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.35వేల కోట్లు)కు ఈ ఒప్పందం కుదరగా.. వాటిలో కొన్నింటిపై సెప్టెంబరు 30నాటికి అంగీకారం కుదరాల్సి ఉంది. కాగా.. పలు నిబంధనల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు పేయూ తెలిపింది.