Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇష్మీత్ జీవిత కాలమంతటా ఎవరో ఒకరు ఆమె చేయి పట్టుకొని, ఆమెను కాపాడుతూ, ఆమెకు మార్గం చూపుతూ నడిపిస్తున్నారు. తాను 'నో' అనే పదం వినలేకుండా ఉన్నానని ఆమె పెద్దగా అరచి చెప్పేవరకూ కూడా. అప్పుడు ఏమి జరుగుతుంది? ఇష్మీత్ ని వీక్షించండి కెఎఫ్సి (KFC) యొక్క ఇటీవలి చిత్రం ‘క్షమత’లో ఆమె ప్రయాణాన్ని అనుసరించండి. ఎన్నో ప్రశంసలు పొందిన చలనచిత్ర నిర్మాత షూజిత్ సర్కార్ గారిచే దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం, సైగ భాషల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పివిఆర్ చాణక్యపురి ఢిల్లీలో ప్రత్యేకమైన పరిశీలనలో కెఎఫ్సి ఇండియా జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మరియు షూజిత్ గారలచే ఈ రోజు ప్రారంభించబడింది. అష్మిత్ కౌర్ మరియు సప్నా సోనీ గారులచే అందంగా చిత్రీకరించబడి, హృదయాన్ని కదిలించే ఈ చిత్రం, ఇష్మీత్ తాను ఏమి చేయగలదో మరియు ఏమి చేయజాలదో చెబుతూ సామాజిక సంకెళ్ళను ఛేధిస్తూ తెలియజేసే ఆమె జీవితం లోనికి ఒక సమగ్ర వీక్షణను అందిస్తుంది. ఈ స్క్రీనింగ్ అనంతరం, మోక్ష్, షూజిత్, ఓజిల్వీ, ఛీఫ్ క్రియేటివ్ అధికారి, రీతూ శారద మరియు క్యాప్స్టోన్ పీపుల్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు మరియు సిఈఓ మరియు విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకులు డా. సుజయ బెనర్జీ గారలతో కూడిన ఒక ప్యానల్ చర్చ జరిగింది, అందులో ప్యానల్ సభ్యులు మాట మరియు వినికిడి లోపము (SHI) కొరకు సంభావ్యతను వెలికితీయడంపై తమ అభిప్రాయాలను పరస్పర వినిమయం చేసుకున్నారు. ప్రజలను #SpeakSign పట్ల ఆసక్తి చూపాల్సిందిగా కోరుతూ, ఈ వేడుక వద్ద అతిథులకు కెఎఫ్సి యొక్క ప్రత్యేక సమర్థత గల టీము సభ్యులు ఇంద్రజీత్ గారు ప్రాథమిక సైగ భాషలో బోధన ఇవ్వడం జరిగింది.
క్షమత చిత్రం సమర్థత అసమతుల్యతను భర్తీ చేసే దిశగా బ్రాండ్ యొక్క ప్రయాణం గురించి మాట్లాడుతూ, కెఎఫ్సి ఇండియా జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా, ఇలా అన్నారు, "క్షమత ప్రోగ్రాముపై మా పని మా నియామక విధికి అతీతంగా వెళుతుంది. #SpeakSign తో, సమాచార వినిమయం యొక్క ఒక రూపముగా సైగ భాష పట్ల అవగాహన స్వీకారమును కలిగించడానికి ఉన్న అడ్డంకులను పక్కకు జరుపుతూ మరియు చేకూర్పును బలపరుస్తూ మేము మా ప్రయత్నాలను బలోపేతం చేసుకుంటున్నాము. మా స్వంత టీము లోని ప్రత్యేక సమర్థతలు గల సభ్యులు ఎదుర్కొన్న జీవితాలు మరియు వాస్తవాల నుండి స్ఫూర్తిగా తీసుకొని, ఇష్మీత్ యొక్క కథను సమర్పించడం పట్ల మేము అత్యంత గౌరవంగా భావిస్తున్నాము. ఈ కథను వాస్తవరూపం లోనికి తీసుకురావడంలో మాకు సహాయపడిన షూజిత్ సర్కార్ గారికి మా సంస్థ ఓజిల్వీ పట్ల మేము కృతజ్ఞులమై ఉన్నాము” అన్నారు. ఓజిల్వీ, ఛీఫ్ క్రియేటివ్ అధికారి, నార్త్ అయిన రీతూ శారద గారు, ఏజెన్సీ, “ఇది స్థితిస్థాపకత యొక్క కథ" అనే ఈ చిత్రాన్ని రచించి మరియు భావజాలీకరణ చేసింది. ఎన్నో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని తన రెండు కాళ్ళపై తాను నిలబడాలని కోరుకుంటున్న ఒక చిన్న అమ్మాయి కథ ఇది. ఈ చిత్రం యొక్క కేంద్రీయ ఇతివృత్తముగా - అమ్మాయి చేతిని పట్టుకొని, తదనంతరం నెమ్మదిగా వెళ్ళేలా చేసే మా బాలిక 'క్షమత' యొక్క కవితా ప్రకటనగా ఉంది. వైవిధ్యత మరియు చేకూర్పు యొక్క ఉద్దేశ్యానికి నిజంగా నిబద్ధత కలిగియున్న KFC లోని మా భాగస్వాముల కోసం దీనిని నిర్మించడానికై షూజిత్ సర్కార్ గారితో భాగస్వామ్యం వహించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది” అన్నారు. చిత్ర నిర్మాత షూజిత్ సర్కార్, క్షమత చిత్రాన్ని నిర్మించడం యొక్క తన అనుభవాన్ని చెబుతూ ఇలా అన్నారు, “నేను చాలా నిజమైన మరియు అధీకృత మార్గములో కథను చెప్పాలనుకున్నాను. అందుకోసం, ప్రత్యేక సమర్థత గల అమ్మాయి ధృక్కోణము నుండే దానిని చెప్పాల్సి వచ్చింది. నేను కేవలం నటులుగా ఉన్న వారితో కాకుండా ప్రత్యేక సమర్థతలు గల దివ్యాంగులతోనే చిత్రం తీయాలనుకున్నాను. మరి చివరికి, అది ఇద్దరు అమ్మాయిల అమాయకత్వము మరియు జీవన అనుభవం ప్రకాశించిన ఫలితమైంది మరియు అదే ఈ చిత్రాన్ని నిజాయితీ కలదిగా చేసింది” అన్నారు.
ఇష్మీత్ ఒక రైలు రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న ఒక నిర్మలమైన నేపధ్యంతో ఈ చిత్రం మొదలవుతుంది. ఆమె చిరునవ్వుతూ మరియు అప్పుడప్పుడూ చేతులు ఊపుతుండగా, బహుశా ప్రయాణికులు ఎటువైపుకు దారి తీస్తున్నారో కనుక్కుంటూ, ఆమె చేతిని ఆమె తల్లి గట్టిగా పట్టుకొని ఎక్కడికీ వెళ్ళనీయకుండా చేస్తుండగా తియ్యని ఊహలలోనుంచి బయట పడింది. అప్పటి నుండీ, ఆమె జీవితం ఒకరి తర్వాత మరొకరు చేయి పట్టుకొని నడిపించే జీవితంగా మారిపోయింది, ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యులు గానీ, స్నేహితురాలు కానీ లేదా స్కూల్ వద్ద టీచరు గానీ చేయి పట్టుకొని నడిపించే స్థితిలోనే; అవసరానికి మించి జీవిత సత్యముగా అనిపించేలా ఉండిపోయింది. ఐతే ఆ తర్వాతి జీవితంలో ఆమెకు కలిగిన ఒక అనుభవం ఆమె ధృక్కోణాన్ని మార్చివేసింది. చివరికి ఆమె సామాజిక అడ్డంకులను దాటుకుంటూ 'ఇప్పుడిక చేతిని వదిలిపెట్టు' అని తన తల్లిని కోరుతున్న కదిలించే సన్నివేశముతో తన స్వంత జీవితంలోనికి వచ్చేసింది.
2008 నుండీ మాట వినికిడి లోపము గల వారికి ఉపాధి మరియు ఎదుగుదల అవకాశాలను కల్పించడం ద్వారా, 150 మందికి పైగా మాట వినికిడి లోపము ఉన్న వారిని ఉద్యోగాలలో నియమించుకోవడం మరియు మద్దతు ఇవ్వడం ద్వారా వారిని సక్రియపరచడంలో కెఎఫ్సి (KFC) ఇండియా మార్గదర్శకంగా ఉంటోంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ సైగ భాషల దినోత్సవం సందర్భాన్ని గుర్తుగా జరుపుకోవడానికి గాను, #SpeakSign క్యాంపెయిన్ 33 ప్రత్యేక KFC రెస్టారెంట్లలో (ప్రత్యేక సమర్థత గల టీము సభ్యులచే నడుపబడుతున్న రెస్టారెంట్లు) 19 నగరాల వ్యాప్తంగా, కేవలం సైగ భాషలోనే కమ్యూనికేట్ చేయాల్సిందిగా కస్టమర్లు టీము సభ్యులను ప్రోత్సహిస్తూ నిర్వహించబడింది. KFC క్షమతతో, ప్రత్యేక KFC రెస్టారెంట్ల సంఖ్యను రెట్టింపు చేయడం మరియు తమ రెస్టారెంట్లలో మహిళా పనివారి సంఖ్యను పెంచడం ద్వారా 2024 నాటికి 2X సాధికారత ను ముందుకు నడపడానికి బ్రాండు ప్రతిజ్ఞ తీసుకొంది. తమ రెస్టారెంటులకు అతీతంగా ప్రతిజ్ఞ తీసుకుంటూ, దేశములో బధిరుల క్రికెట్ క్రీడ సాదృశ్యం మరియు ఎదుగుదలను వృద్ధి చేయడానికి గాను,'ప్రధాన ప్రాయోజితులు' గా బ్రాండు భారతీయ బధిరుల క్రికెట్ అసోసియేషన్ (IDCA) తో భాగస్వామ్యం కుదుర్చుకొంది.