Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిర్టెల్ 5జి ప్లస్ ఇప్పుడు 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. వేగవంతమైన చర్యల ద్వారా భారతదేశం మొత్తం 2023 నాటికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఎయిర్టెల్ 5జి ప్లస్ భారీ వేగం, ఉత్తమ వాయిస్ అనుభవాన్ని అందించే హామీ ఇస్తుంది. అన్ని 5జి స్మార్ట్ ఫోన్లలో ఇది పని చేస్తుంది, పర్యావరణ స్నేహిగా ఉంటుంది
వినియోగదారులు ప్రస్తుతం వినియోగిస్తున్న తమ డేటా ప్లాన్లు పూర్తయ్యే వరకు 5జి సేవలను వినియోగించుకోవచ్చు.
సిమ్ మార్చుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ఎయిర్ 4జి సిమ్ ఇప్పుడు 5జి సేవలను అందిస్తుంది.
ఇండియా, 2022: భారతదేశంలో ప్రీమియర్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ (“Airtel”) దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఎయిర్టెల్ 5జి ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు నేడు ప్రకటించింది.
ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్ మరియు వారణాసిలలోని వినియోగదారులు అత్యాధునిక ఎయిర్టెల్ 5జి ప్లస్ సేవలను అందుకుంటారు. కంపెనీ తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంటూ, రోల్ అవుట్ను పూర్తి చేసే వరకు ఈ సేవలను వినియోగదారులు దశల వారీగా అందుకుంటారు. ఇప్పటికే 5జి స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్న వినియోగదారులు తమ ప్రస్తుత డేటా ప్లాన్లు పూర్తయ్యే వరకు హై స్పీడ్ ఎయిర్టెల్ 5జి ప్లస్ సేవలను వినియోగించుకునేందుకు కంపెనీ అవకాశం కల్పిస్తోంది.
ఎయిర్టెల్ 5జి ప్లస్ వినియోగాదారులకు మూడు తప్పనిసరి ప్రయోజనాలను అందిస్తోంది. మొదటిది, ఇది అత్యంత అభివృద్ధి చెందిన పర్యావరణ వ్యవస్థతో ప్రపంచంలోనే విస్తృత ఆమోదం కలిగిన సాంకేతికతపై నడుస్తుంది. ఇది భారతదేశంలోని అన్ని 5జి స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ నెట్వర్క్లో సజావుగా పని చేస్తుందని నిర్ధారిస్తుంది. రెండవది, అద్భుతమైన వాయిస్ అనుభవం, సూపర్-ఫాస్ట్ కాల్ కనెక్ట్తో పాటు నేటి కన్నా 20 నుంచి 30 రెట్లు అధిక వేగంతో అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. చివరగా, ఎయిర్టెల్ 5జి ప్లస్ నెట్వర్క్ కూడా దాని ప్రత్యేక పవర్ తగ్గింపు పరిష్కారంతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ గోపాల్ విఠల్ మాట్లాడుతూ 'గత 27 ఏండ్లుగా భారతదేశంలోని టెలికాం విప్లవంలో ఎయిర్టెల్ ముందంజలో ఉంది. మా వినియోగదారులకు ఉత్తమమైన అనుభవాన్ని అందించేందుకు అత్యుత్తమ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకు వస్తూ నేడు మా ప్రయాణంలో మరో మెట్టును అధిరోహించాము. మా కోసం, మేము చేసే ప్రతి పనిలో మా వినియోగదారులు కీలకంగా ఉంటారు. కనుక, మా పరిష్కారం ఏదైనా 5జి హ్యాండ్సెట్ మరియు వినియోగదారులు తాము కలిగి ఉన్న ప్రస్తుత సిమ్లో అత్యాధునిక సేవలు పొందవచ్చు. వినియోగదారుని అనుభవంపై మా మక్కువ ఇప్పుడు పర్యావరణానికి అనుకూలంగా ఉండే 5జి పరిష్కారంతో అందుబాటులోకి తీసుకువచ్చాము. ఎయిర్టెల్ 5జి ప్లస్ రానున్న ఏండ్లలో ప్రజలు కమ్యూనికేట్ చేసే, జీవించే, పని చేసే, అనుసంధానం అయ్యే మరియు ఆడుకునే విధానాన్ని సరికొత్తగా నిర్వచించేందుకు సిద్ధంగా ఉంది` అని అన్నారు.
ఎయిర్టెల్ 5జి ప్లస్ ఎయిర్టెల్ అందించే మొత్తం పోర్ట్ఫోలియో సేవలను మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల ఇన్స్టంట్ అప్లోడ్ మరియు మరిన్నింటికి సూపర్ఫాస్ట్ యాక్సెస్ను అనుమతిస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ, వ్యవసాయం, మొబిలిటీ మరియు లాజిస్టిక్లలో ఎయిర్టెల్ 5జి ప్లస్ విప్లవాత్మక మార్పులతో భారతదేశం ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంది. ఎయిర్టెల్ 5జి ప్లస్కు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి https://www.airtel.in/5g-networkకు లాగిన్ అవ్వండి.
గత ఒక ఏడాదిలో, ఎయిర్టెల్ 5జి శక్తిని అనేక శక్తివంతమైన వినియోగ కేసులతో ప్రదర్శించింది. అది మన జీవితాలను నడిపించే మరియు వ్యాపారం చేసే విధానంలో మార్పు తీసుకు వస్తుంది. హైదరాబాద్లో మొదటి ప్రత్యక్ష 5జి నెట్వర్క్ సేవల నుంచి భారతదేశపు 5జి శక్తితో కూడిన మొదటి హోలోగ్రామ్ వరకు భారతదేశపు ఆటలో మొదటి రిక్రియేషన్ ప్రపంచ కప్ ఆట ప్రత్యక్ష ప్రసారాన్ని మార్చడంతో పాటు, మొదటి 5జి అనుసంధానాన్ని కలిగిన అంబులెన్సు నుంచి మొదటి ప్రయివేటు 5జి నెట్వర్కు వరకు అన్ని సేవలు అందించడం నుంచి 5జి ఆవిష్కరణ వరకు ఎయిర్టెల్ ముందంజలో ఉంది.