Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: త్వరలోనే పైలట్ ప్రాజెక్టు కింద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి)ని విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ వెల్లడించిం ది. ఇందు కోసం పరిమిత స్థాయిలో డిజిటల్ రూపీ (ఇ-రూపీ)ని తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టు విస్తరణ క్రమంలో సిబిడిసి ప్రయోజనాలు తెలుస్తాయని ఆర్బిఐ తెలి పింది. దీనికి సంబంధించి శుక్రవారం విధాన పత్రాన్ని విడుదల చేసిం ది. ఇందులో సాంకేతికత, ఉపయోగాలు, జారీ విధానం, డిజైన్ ప్రత్యా మ్నాయాల వంటి వివరాలను పొందుపర్చింది. ద్రవ్య విధానం, ఆర్థిక సుస్థిరతలను పరిశీలిస్తుందని వివరించింది. ఈ కరెన్సీ కేవలం డిజిట ల్ రూపంలో ఉండడమే ప్రత్యేకత అని పేర్కొంది. ఇతర డిజిటల్ మనీ తరహాలోనే అన్ని లావాదేవీ ప్రయోజనాలు దీనికి ఉంటాయని వెల్లడించింది.