Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. ఉత్పత్తిని బట్టి 2 నుంచి 19 శాతం వరకు ధరలకు కోత పెట్టినట్లు పేర్కొంది. ఇంతక్రితం ముడిసరకు ధరల్లో పెరుగదల వల్ల ఆయా ఉత్పత్తులను ధరలను భారీగా పెంచింది. ఇటీవల ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సర్ప్ఎక్సల్, రిన్, లైఫ్బారు తదితర ఉత్పత్తులను హెచ్యుఎల్ తయారు చేస్తుంది. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా ఇటీవల సబ్బులు, సర్పుల ధరలను స్వల్పంగా తగ్గించింది.