Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పీయూష్
న్యూఢిల్లీ : ఎగుమతుల రంగంలోని కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. వ్యాపారవేత్తలతో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎగుమతిదారుల డిమాండ్లు, సమస్యలను నెరవేర్చడానికి కేంద్రంగా సిద్దంగా ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎగుమతిదారులకు మద్దతు ఇస్తామన్నారు. విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయంగా చౌక ఉత్పత్తులను తయారీదారులు అందుబాటులోకి తేవాలన్నారు.