Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంట గ్యాస్ భారము
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా సిఎన్జి సహా పైపు ద్వారా అందించే వంట గ్యాస్ ధరలను మరోసారి పెంచింది. శనివారం సిఎన్జి, వంట గ్యాస్పైన రూ.3 చొప్పున భారం వేసింది. దేశ రాజధానిలో కిలో సిఎన్జి ధరను రూ.78.61కి చేర్చింది. ఇంతక్రితం ఇది రూ.75.61గా ఉంది. దీంతో మార్చి 7 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ధరలు పెంచినట్లయ్యింది. ఈ సమయంలో సిఎన్జిపై ధర ఏకంగా రూ.22.60 పెరిగింది. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కిలో సిఎన్జిపై ధర ఏకంగా రూ.35.21 లేదా 80 శాతం ఎగిసింది.
ఇదే సమయంలో వంటగది కోసం కుటుంబాలు ఉపయోగించే పిఎన్జిపై స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పరిమాణం ధరను నమో రూ.3 పెంచి 53.59 చేర్చింది. ఈ గ్యాస్ ధర ఆగస్టు 2021 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు పెంచింది. ఈ కాలంలో మొత్తంగా రూ.29.93 లేదా 91 శాతం ధరలను కేంద్రం పెంచేసింది. అధిక ధరలతో అనేక కుటుంబాల పొదుపు, వ్యయాలు భారీగా పడిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.