Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణ పరిణామం ఎక్కువ మార్గదర్శకాల మధ్య కూడా 78.3శాతం భారతీయులు వారి జీవితకాలంలో వాతావరణ విపత్తును నివారించవచ్చు అనే ఆశాభావాన్ని కలిగి ఉన్నారు. ఒక ఏడాది క్రితంతో పోల్చితే 73.4% ఎక్కువ.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భారతదేశంలో వాతావరణ విపత్తును విషయానికి వస్తే ప్రపంచంలోని ఇతర ఏ దేశంతో పోల్చినా అత్యంత ఎక్కువ ప్రమాణంలో ఆశావాదులు ఉన్నారు
హైదరాబాద్ : డిజిటల్ ఇమేజింగ్ మరియు ముద్రణ పరిష్కరణలలో ప్రపంచ నాయకుడు ఎప్సన్ వాతావరణ మార్పుల గురించి విస్తారమైన దేశాలు, వయస్సులు మరియు నేపథ్యాలకు చెందిన ప్రజల అవగాహనను అంచనా వేసే తన మొదటి సమీక్ష క్లైమేట్ రియాలిటీ బారోమీటర్ను 2021లో ప్రకటించింది.
ఎప్సన్ నేడు తన రెండవ క్లైమేట్ రియాలిటీ బారోమీటర్-2022 ఫలితాలను ప్రకటించగా ఇది భారతదేశంతో కలిపి 22 దేశాలలో 26,205 మంది ప్రజలను అభిప్రాయాలను సేకరించింది. కొత్త ఫలితాంశాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు వ్యక్తిగత ప్రయత్నాలను నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ సాంకేతికత నాయకుని అధ్యయనం ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాతావరణ మార్పులతో కూడిన సవాళ్లను నియంత్రించే ప్రయత్నాల నుంచి విముఖం కాగా, వాతావరణ మార్పులు పలువురికి ప్రాథమిక బాధ్యతగా ఉంది.
ఈ సమీక్ష వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను ఆవిష్కరిస్తున్నట్లే పోకడలు ఎలా మారుతున్నాయి (మరియు మారడం లేదు) అనే దాని గురించి మహోన్నతమైన అభిప్రాయాలను పేర్కొంది. మొదటి బారోమీటర్లో 'క్లైమేట్ రియాలిటీ డెఫిసిట్` ను గుర్తించగా, అది పట్టువదలకుండా మిగిలింది- ఈ డేటా ప్రకారం అది చిన్నదిగా మారుతుంది మరియు ప్రజలు ఈ సమస్యను నివారించేందుకు తమకు సాధ్యమైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియజేస్తోంది.
ఏమైనప్పటికీ భారతదేశంలో బయటకు కనిపిస్తున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవలి నెలల్లో భారతదేశం రికార్డులు అధిగమించేలా వేడిగాలుల ప్రభావం కనిపించగా, అది వాతావరణంలోని మార్పుల సమస్యలతో ఎదురైన 100 రెట్లు సమస్యే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (source)
ఇదే కాకుండా భారతదేశంలో సమీక్షకు స్పందించిన నలుగురిలో ముగ్గురు (78.3%) ప్రజలు వారి జీవితకాలంలో వాతావరణ విపత్తును నివారించవచ్చు అనే ఆశాభావాన్ని కలిగి ఉన్నారు. ఇతర దేశాల్లో సమీక్షకు స్పందించిన వారు తక్కువ ఆశావాదాన్ని కలిగి ఉండగా, అందులో ఫ్రాన్స్ (22.5%) మరియు జపాన్ (10.4%) విరుద్ధ దిశలో ఉన్నారు.
మరోవైపు, భారతదేశంలో వారి జీవితావధిలో వాతావరణ విపత్తులను నివారించడం గురించి 10.8% మంది నిరాశతో ఉన్నారు. ఫ్రాన్స్లో 53.5% మంది జపాన్లో 67.4% మంది దీనికి వ్యతిరేకంగా అవగాహన కలిగి ఉండలేదు.
ఎప్సన్ క్లైమేట్ బారోమీటర్లో భాగంగా భారతదేశంలో సమీక్షకు స్పందించిన మూడవ వంతు మంది (39.2%) ప్రజలు వృద్ధి చెందుతున్న ధరలు మరియు ఆర్థిక వ్యవస్థను సరి చేయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కంపెనీలు మరియు ప్రజలకు ప్రాధాన్యతగా ఉండాలి అని భావించగా, కేవలం 21.1% మంది వాతావరణ మార్పులు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమని భావించారు. దీనికి వ్యతిరేకంగా చైనాలో 37.3% మంది వాతావరణ మార్పులు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమని పేర్కొన్నారు.
భారతదేశంలో సమీక్షకు స్పందించిన 25-34 ఏండ్ల వయసు వారు (82.4%), 45-54 (68.1%) వయసు వారి కన్నా ఎక్కువ ఆశావాదులుగా ఉన్నారు మరియు యువతలో అవగాహన కొరత గురించి బాధ్యత పుట్టిస్తోంది.
వాస్తవిక చర్యలు: వ్యక్తిగత అడుగులు
భరోసా ఇచ్చే విషయం ఏమిటంటే, ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తులు ఇప్పటికే వాతావరణానికి సంబంధించి అత్యవసరంగా ఎదుర్కొనవలసిన పలు చర్యలను ఇప్పటికీ తీసుకున్నారు.
భారతదేశంలో ప్రజలు పేర్కొన్న ప్రముఖ మూడు చర్యలు ఇలా ఉన్నాయి:
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం (66.7%)
నడక లేదా సైకిల్ను ఎక్కువగా వినియోగించడం (61.6%)
రీసైక్లింగ్ అలవాట్లను మెరుగుపరుచుకోవడం (60.5%)
వాతావరణ మార్పుల పరిణామాలను నివారించేందుకు చర్యలను తీసుకున్న వారిలో ప్రలు ఎలా వరుసగా ఈ చర్యలకు కట్టుబడి ఉన్నారు అనే విషయంలో కొన్ని అంతరాలు ఉన్నాయి. ఉదాహరణకు, కేవలం (20.8%) మంది మాత్రమే ప్లాస్టిక్ వినియోగాన్ని ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలం ప్రయత్నించారు మరియు అలాగా కొనసాగించారు. జాగృతిని పెంపొందించే మరియు మార్పులకు స్ఫూర్తి నింపే ప్రయత్నాలు కొనసాగాలి మరియు స్థిరంగా ఉండాలి.
అయితే వ్యక్తిగత జీవనశైలి మార్పులు వాతావరణ మార్పునకు పెద్ద పీట వేస్తుంది. భారతదేశంలో మార్పులకు ప్రముఖ ప్రేరణ శక్తులు ఇలా ఉన్నాయి:
కంపెనీ లేదా సముదాయపు సుస్థిరత కార్యక్రమాలు (39.8%)
ప్రభుత్వ విధానంలో మార్పులు (38.9%)
ఇన్ఫ్లుయెన్సర్లు (37.2%)
ఇప్పటి వాస్తవం: ఆ తర్వాత ఏమిటి?
భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి చెందుతున్న ఆశావాదంతో కూడిన వాతావరణ వాస్తవానికి వ్యతిరేకంగా ఉంది. 2022లో ఇంటర్గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (IPCC) 'మానవ-ప్రేరిత వాతావరణ మార్పులు ఎక్కువ అపాయం మరియు పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తుంది మరియు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలకు హాని కలిగిస్తుంది` అని ప్రకటించింది.
ఎప్సన్ గ్లోబల్ అధ్యక్షుడు యుసునోరి ఒగావా మాట్లాడుతూ, 'ఎప్సన్ కార్పొరేట్ ఉద్దేశాల ప్రకారం జీవితాలు మరియు భూగోళాన్ని మెరుగుపరచేందుకు ప్రాధాన్యత ఇస్తోంది మరియు మేము దీన్ని సాధించేందుకు గమనార్హమైన వనరులను కేటాయించాము. ప్రపంచం సిఓపీ 27ను అలవర్చుకుంటున్నప్పుడు మేము క్లైమేట్ రియాలిటీ బారోమీటర్లో వచ్చే మార్పుల గురించి జాగృతిని కల్పించే మరియు సాధికారతను కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. బారోమీటర్ ఇన్సైట్లు ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు వ్యక్తులకు వాతావరణ విపత్తును నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాల వైపు చర్యలు తీసుకునేందుకు మద్దతు ఇస్తుంది అనే భరోసా మాకు ఉంది. చాలా సుదీర్ఘమైన మార్గం ముందుంది అని మాకు తెలిసినప్పటికీ, మనం కలిసి పని చేస్తే మరియు ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే ఉత్తమ భవిష్యత్తును నిర్మించవచ్చని విశ్వసిస్తున్నాము` అని వివరించారు.
ఎప్సన్ క్లైమేట్ రియాలిటీ బారోమీటర్ 2022 అంతగా ఆశావాద లక్షణాలను చూపించడం లేదు. ఇది అల్పావధి ఆర్థిక డిమాండ్లు, ప్రభుత్వాలు, వ్యాపారాలు మరియు వ్యక్తులను తప్పనిసరి వాతావరణ చర్యల నుంచి విముఖత కల్పిస్తుంది. ప్రపంచం దాని గమనం వైపు కేంద్రీకరించి మరియు నిర్ణయాలను తీసుకోగలిగిన, వేగవంతమైన మరియు పరిణామకారి ప్రతిక్రియలను ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధ్రువీకరించవలసిన అవసరం ఉంది.
వ్యక్తిగత చర్యలు ఎక్కువ అవుతున్న కొద్దీ మరిన్ని పనులు కావాలన్నదీ అంతే స్పష్టం. ప్రపంచం తన వాతావరణ మార్పుల లక్ష్యాలను చేరుకునేందుకు మరియు మార్పు చేయలేని మార్పులను తప్పించాలంటే ప్రభుత్వాలు సుస్థిరతకు నియంత్రణలను తీసుకు రావలసిన అవసరం ఉంది. వ్యాపారాలు సుస్థిర విధానాలు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేసుకునే మరియు వ్యక్తులు జీవనశైలి మార్పులను వృద్ధి చేసుకునే అవసరం ఉంది. అందరూ కలిసి పని చేస్తూ, మనం అందరం ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎప్సప్ విశ్వసిస్తోంది.
రీసర్చ్ మెథడాలజీ: ఆన్లైన్ సమీక్షను 29.07.022 నుంచి 4.08.2022 వరకు 26,205 మందిని ప్రపంచ వ్యాప్తంగా మరియు భారతదేశంలో 1,300 మందితో నిర్వహించారు.