Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ ప్రపంచ దృష్టి దినం సందర్భంగా, శామ్ సంగ్ వారి గాలక్సీ అప్ సైక్లింగ్ ప్రోగ్రాం తమ విలక్షణమైన EYELIKE™ ఫండర్ కెమేరాను ఉపయోగించి నేత్ర వ్యాధులు కోసం 2023 నాటికి భారతదేశంలో 150,000 మందికి పైగా వ్యక్తులను పరీక్షించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడానికి మరియు సేవలు అందని సమాజాలలో కంటి ఆరోగ్య సంరక్షణ ఉత్తమంగా అందుబాటులో ఉండేలా వీలు కల్పించడానికి గాలక్సీ అప్ సైక్లింగ్ ప్రోగ్రాంలో భాగంగా, శామ్ సంగ్ పాత గాలక్సీ డివైజ్ లను కొత్తవిగా మారుస్తోంది. అంతర్జాతీయంగా, 1.1 బిలియన్ ప్రజలు కంటిచూపు కోల్పో బాధపడుతున్నారు, అల్ప మరియు మధ్యస్థ ఆదాయం గల దేశాలలో జీవిస్తున్న 90% మంది సరసమైన మరియు మంచి నాణ్యత గల కంటి ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, పాత మరియు ఉపయోగించబడని గాలక్సీ టెక్నాలజీని EYELIKE™ ఫండస్ కెమేరాలుగా పిలువబడే వైద్య నిర్థారణ కెమేరాలుగా మార్చడానికి శామ్ సంగ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్ నెస్ (ఐఏపీబీ), యోన్ సీ యూనివర్శిటీ హెల్త్ సిస్టం (వైయూహెచ్ఎస్) మరియు ల్యాబ్ ఎస్ డీ, ఇన్ కార్పొరేషన్ తో భాగస్వామం చెందింది. అంధత్వానికి దారితీసే పరిస్థితులు కోసం రోగులను పరీక్షించడానికి వైద్యపరమన మరియు వైద్యేతర ప్రొఫెషనల్స్ ఇరువురినీ ఈ డివైజ్ అవకాశం ఇస్తుంది. గాలక్సీ అప్ సైక్లింగ్ వంటి ప్రోగ్రాంస్ ద్వారా, శామ్ సంగ్ మన అనుభవాలను ప్రపంచంతో పునః రూపొందించడానికి ఆధునిక సాంకేతికతలను కేటాయించడమే కాకుండా, కస్టమర్స్ మరింత పర్యావరణహితమైన చైతన్యం కలిగిన జీవనశైలులను అనుసరించేలా కూడా వారికి సాధికారత కల్పిస్తోంది. కంటి సంరక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న విజన్ సెంటర్స్ లో పరికరాలు, వ్యాన్లు, బేస్ హాస్పిటల్స్ ఉపయోగించడానికి, రోగులకు వ్యాధి నిర్థారణ చేయడానికి ప్రోగ్రాం నాలుగు నేత్ర వైద్యశాలలతో భాగస్వామం చెందింది- ఉత్తర్ ప్రదేశ్ లో సీతాపూర్ లో ఉన్న సీతాపూర్ ఐ ఆసుపత్రి, పాండిచ్చేరిలో ఉన్న అరవింద్ ఐ ఆసుపత్రి, రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న గురుహస్తి చికిత్సాలయ మరియు న్యూఢిల్లీలో ఉన్న డాక్టర్. ష్రాఫ్ చారిటీ ఐ ఆసుపత్రి. ఇప్పటి వరకు, శామ్ సంగ్ సెకండ్ హ్యాండ్ గాలక్సీ స్మార్ట్ ఫోన్స్ ను సుమారు 200 యూనిట్స్ ను అప్ సైకిల్ చేసింది మరియు భారతదేశంలో భాగస్వాములకు EYELIKE™ ఫండస్ కెమేరాలను పంపిణీ చేసింది. పాత గాలక్సీ స్మార్ట్ ఫోన్ EYELIKE™ హ్యాండ్ హెల్త్ ఫండస్ కెమేరాగా మారడానికి కీలకంగా నిలిచింది. మెరుగైన ఫండస్ నిర్థారణ కోసం లెన్స్ అటాచ్మెంట్ కు కనక్ట్ చేయబడి ఇమేజెస్ ను కాప్చర్ చేస్తుంది. నేత్ర వ్యాధులను విశ్లేషించి, నిర్థారణ చేయడానికి గాలక్సీ డివైజ్ కృత్రిమ మేథస్సు అల్గోరిథమ్ ను వినియోగిస్తుంది. రోగి డేటాను ఖచ్చితంగా కాప్చర్ చేసే యాప్ కు డివైజ్ కనక్ట్ చేయబడుతుంది మరియు వాణిజ్య పరికరాల ఖర్చులో అతి తక్కువకు చికిత్సా నియమావళిని సూచిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, వయస్సుకు సంబంధించిన మాకులార్ క్షీణత సహా అంధత్వానికి దారితీసే పరిస్థితులు కోసం విలక్షణమైన మరియు సరసమైన వ్యాధి నిర్థారణ కెమేరా రోగులను పరీక్షిస్తుంది. "సమాజం పై సానుకూలమైన ప్రభావం కలిగించడానికి సాంకేతికతను వినియోగించడాన్ని శామ్ సంగ్ లో మేము విశ్వసిస్తాం. గాలక్సీ అప్ సైక్లింగ్ వంటి ప్రోగ్రాంస్ ఆవిష్కరణ శక్తితో జీవితాలను మార్చడంలో మాకు సహాయపడ్డాయి. EYELIKE™ ఫండస్ కెమేరాతో, మా భాగస్వాములు భారతదేశంలో నాణ్యతతో కూడిన కంటి పరీక్షలను కేటాయించగలుగుతారు. బెంగళూరులో శామ్ సంగ్ ఆర్ & డీ సంస్థలో ఇంజనీర్స్ లెన్స్ అటాచ్మెంట్ ను అభివృద్ధి చేసిన ఐఏపీబీ, వైయూహెచ్ఎస్ మరియు ల్యాబ్ ఎస్డీతో పాటు EYELIKE™ప్లాట్ ఫాం పై పని చేసారని" మోహన్ రావు గోలి, సీటీఓ, శామ్ సంగ్ ఆర్ & డీ సంస్థ, బెంగళూరు చెప్పారు. భారతదేశంలో ప్రోగ్రాం ఆరంభమైన నాటి నుండి, నలుగురు భాగస్వాములు కంటి వ్యాధులు కోసం సుమారు 5,000 మంది రోగులను పరీక్షించారు. EYELIKE™ డివైజ్ నిఉపయోగించడం సులభమని, తక్కువ శిక్షణ అవసరమని, పొందికైనది మరియు మంచి నాణ్యత గల ఇమేజ్ ను గ్యారంటీగా అందచేస్తుందని భాగస్వాములు చెప్పారు. కంటి నరం, మాకులార్ మరియు వెజల్స్ ను సులభంగా గుర్తించడానికి అవకాశం ఇస్తుంది. ఈ ప్రయోజనాలతో భాగస్వాములు కంటి వైద్య సంరక్షణ కేవలం పరిమితంగా లభించే గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సహాయపడగలుగుతున్నారు. కొరియా బయట అతి పెద్ద శామ్ సంగ్ ఆర్ & డీ కేంద్రం, బెంగళూరులో శామ్ సంగ్ ఆర్ & డీ సంస్థలో ఇంజనీర్స్, EYELIKE™ అప్లికేషన్ లో ఫండస్ ఇమేజ్ కాప్చర్ మెకానిజం ఏఐ ఆధారిత ప్రాసెసింగ్ అల్గోరిథమ్, ఆలోచనాత్మక యూఐ మరియు సర్వర్ సంబంధిత ఆపరేషన్స్ అభివృద్ధి చేసారు. ద EYELIKE™ ప్లాట్ ఫాం రెటీనా ఇమేజెస్ ను స్కాన్ చేస్తుంది మరియు రెటీనా చిత్రాలలో వ్యాధులను గుర్తించడానికి ఈ ఫోన్స్ యొక్క గణన సామర్థ్యాలు ద్వారా మద్దతు చేయబడే ఖచ్చితమైన ఏఐ-ఆధారిత అల్గోరిథమ్ ను ఉపయోగిస్తుంది మరియు వాటిని సాధారణమా లేదా అసాధారణమా అని వర్గీకరిస్తుంది. " EYELIKE™ ఫండస్ కెమేరా పై శామ్ సంగ్ మరియు ల్యాబ్ ఎస్ డీతో నిరంతరంగా భాగస్వామం చెందినందుకు ఐఏపీబీ గర్విస్తోంది. అందరి కోసం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో క్రాస్-సెక్టర్ సహకారం అనుసరించే ప్రాధాన్యతను మా పని ప్రధానాంశంగా చూపిస్తుంది. వరల్డ్ సైట్ డే దగ్గరపడనున్న నేపధ్యంలో, 2030 ఇన్ సైట్ వ్యూహం పై అందచేయడం అంటే ప్రగతి వేగం పెంచడానికి కొత్త టెక్నాలజీలను నిమగ్నం చేయడంగా భావించాలని మేము గుర్తు చేస్తున్నాము" డ్రూ కీస్, వెస్ట్రన్ పసిఫిక్ రీజనల్ మేనేజర్, ఐఏపీబీ అన్నారు.
" EYELIKE™ అనేది అందుబాటులో ఉండే మరియు సరసమైన కంటి సంరక్షణకు అడ్డంకులను అధిగమించే పరస్పర లక్ష్యంతో టెక్నాలజీ మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలలో నాయకులు మధ్య సహకార ఫలితం. మా భాగస్వాములను విస్తరించడం ద్వారా, 2030 ఇన్ సైట్ వ్యూహం యొక్క మూడు ప్రధానమైన అంశాలను అభివృద్ధి చేస్తున్నాం. అవి- పెంచడం, సమీకృతం చేయడం మరియు యాక్టివేట్ చేయడం - ప్లాట్ ఫాం సుస్థిరంగా మరియు అభివృద్ధి చేయబడే విధంగా చేయడానికి " అని హోల్డెన్ యూన్ స్యూంగ్ కిమ్, సీఈఓ, ల్యాబ్ ఎస్ డీ, ఇన్ కార్పొరేషన్ అన్నారు. ఈ విలక్షణమైన మరియు సరసమైన పరిష్కారం ద్వారా శామ్ సంగ్ వియత్నాం, మోరోకో మరియు పపువా, న్యూ గినియాలలో సేవలు అందని జనాభాలు కోసం కూడా సహాయపడుతోంది.