Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ సెప్టెంబర్లో రూ.1,167 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎన్టీపీసీ రెనివేబుల్ ఎనర్జీ నుంచి చేజిక్కించుకున్న ఆర్డర్ సైతం ఉందని పెన్నార్ ఇండిస్టీస్ కార్పొరేట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కూరం వెల్లడించారు. 'రాజస్థాన్్లో ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఏసీ /625 మెగావాట్ల డీసీ సోలార్ పీవీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్, సరఫరా, నిర్మాణం, నిర్వహణ కాంట్రాక్టుకై నిర్వహించిన టెండర్లలో లోయెస్ట్ బిడ్డర్గా పెన్నార్ ఇండిస్టీస్ నిలిచింది. 12.5 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు పెన్నార్ స్వీకరిస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో కంపెనీ నిబద్ధతకు తాజా కాంట్రాక్ట్ నిదర్శనం. సోలార్ ఈపీసీ, తయారీ రంగంలో సమీకృత సంస్థగా వద్ధి చెందాలన్నది మా లక్ష్యం' అని సునీల్ కూరం తెలిపారు.