Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : మెజారిటీ ప్రజలు 5జీ టెలికం సేవల పట్ల అనాసక్తిని కనబర్చుతున్నారు. 5 శాతం లోపు మంది మాత్రమే ఈ సేవలను కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదిక లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 318 జిల్లాల్లోని 29,000 మంది మొబైల్ వినియోగదారులను సర్వే చేసి ఈ రిపోర్టును రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఇప్పటికే పలు నగరాల్లో 5జి సేవలను లాంచనంగా ప్రారంభించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారిగా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆసక్తులను కనుక్కోవడానికి లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. 5జీ సేవల కోసం తాము అదనం చార్జీలు చెల్లించలేమని 43 శాతం స్పష్టం చేశారు. 5జీపై ఆసక్తి చూపిన వారిలో ప్రస్తుత టారీఫ్లను 10 శాతం పెంచితే పర్వాలేదని 43 శాతం మంది పేర్కొన్నారు. 10-25 శాతం టారీఫ్లు పెంచిన కొనుగోలు చేస్తామని కేవలం 2 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు.