Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురు వారం నుంచి రిటైల్ డిజిటల్ రూపీ పైలట్ ప్రాజెక్టును ప్రారం భించనుంది. తొలుత ఎంపిక చేసిన ముంబయి, న్యూ ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ-రూపాయిని అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరించే ఈ డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్లో ఆ కరెన్సీ సృష్టి, పంపిణీ, రిటైల్ వినియోగం మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. అనంతరం రిటైల్ డిజిటల్ రూపా యిలో చేయాల్సిన మార్పులపై దృష్టి సారించనుంది. ఆ తర్వాత అహ్మదా బాద్, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పట్నా, సిమ్లాలకు విస్తరించనున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం 8 బ్యాంకులను ఆర్బీఐ ఎంపిక చేసింది. తొలి దశ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు ఈ సేవలను అందించనున్నాయి. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్తో సహా మరో నాలుగు బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో చేరనున్నాయి. పైలట్ ప్రాజెక్ట్లో ఎంపిక చేసిన ప్రదేశాలలో వినియోగదా రులు, వ్యాపారుల మధ్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ-రూపాయి బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. విని యోగదారులు దీన్ని మొబైల్ ఫోన్లలోని డిజిటల్ వాలెట్లలో ఉంచుకోవచ్చు. ఈ డిజిటల్ వాలెట్ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి వ్యాపారికి లావాదేవీలు జరుగుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెల్లింపులు జరుపవచ్చు. ఇ-రూపాయిని డబ్బు రూపంలోకి కూడా మార్చు కునే వీలు కల్పించారు. ఇ-రూపాయి విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీకి సమానంగానే ఉంటుంది. ఇ-రూపాయి అందు బాటుతో జేబులో నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలనే ఒత్తిడి ఉండదు. దీంతో నగదు రహిత చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇ-రూపాయి అందుబాటులోకి రావడంతో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. భౌతిక రూపాయి ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుందని ఆర్బిఐ పేర్కొంటుంది. దీన్ని తొలుత నవంబర్ 1 నుంచి ఎంపిక చేసిన టోకు అవసరాలకు వినియోగించేలా పైలట్ ప్రాజెక్టును చేపట్టారు.