Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతికి ఆర్టీసీ ఆఫర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ముందస్తుగా రానూ, పోనూ టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ చార్జీలో పది శాతం రాయితీ ఇస్తామని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్కి ఈ రాయితీ వర్తిస్తుంది. 2023 జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని వారు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్టు సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. www.tsrtconline.in వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.