Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తా నియా చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన కార్య క్రమంలో 25 మీటర్ల గన్ షూటింగ్లో జాతీయ స్థాయిలో రాపిడ్ ఈవెంట్, స్టాడర్ట్ ఈవెంట్లో వెండి పతకం సాధించిన కె తనిష్క్ను, ఖేలో ఇండియా తరఫున ఢిల్లీలో పాల్గొని షార్ట్ గన్ స్కేట్లో ఏషియన్ వెండి పతకం సాధించిన రష్మీ రాథోడ్ను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పథకాలను సాధించడం పట్ల ఆయన క్రీడా కారులను అభినందించారు.