Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు మొత్తంమ్మీద 12 లక్షల రూపాయలను అందించడంతో పాటుగా హెచ్సీఎల్ ఇన్నోవేషన్ ల్యాబ్ వద్ద అభ్యసించే అవకాశం అందించనున్నారు. దీనితో పాటుగా ప్రతి ఫైనలిస్ట్కూ 15వేల రూపాయల విలువైన బహుమతులు కూడా అందించనున్నారు.
- భారతదేశపు అగ్రగామి యువ ప్రాబ్లమ్ సాల్వర్స్ మరియు ప్రాబ్లమ్సాల్వింగ్ స్కూల్స్ను గుర్తించే వినూత్నమైన ఒలింపియాడ్
నవతెలంగాణ - హైదరాబాద్
యుఎస్ 12.3 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ సంస్ధ హెచ్సీఎల్ నేడు భారతదేశపు ప్రీమియర్ క్రిటికల్ రీజనింగ్ ప్లాట్ఫామ్ –హెచ్సీఎల్ జిగ్సా 4వ ఎడిషన్ కోసం దరఖాస్తులు తెరిచామని వెల్లడించింది. ఈ భారతదేశ వ్యాప్త కార్యక్రమాన్ని భారతదేశపు అగ్రగామి ప్రాబ్లమ్ సాల్వర్స్ కమ్యూనిటీని నిర్మించే లక్ష్యంతో తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు మల్టీ లేయర్డ్ ఇవాల్యుయేషన్ ప్రక్రియతో బహుమతులు అందజేస్తారు. కాన్సెప్ట్యువల్ థంకింగ్ మరియు వాస్తవ ప్రపంచపు సమస్యలు మరియు సవాళ్లు పై దృష్టి సారించడంతో పాటుగా ఇది పాఠశాల విద్యార్ధులను గ్రేడ్ 6 నుంచి 9 వరకూ అత్యంత కీలకమైన 21వ శతాబ్దపు నైపుణ్యాలైనటువంటి పరిశోధన, క్రిటికల్ థంకింగ్, కమ్యూనికేషన్లో పరిశీలిస్తుంది మరియు వాటిని వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించేలా వినియోగించేందుకు సహాయపడుతుంది. ఆసక్తికలిగిన విద్యార్ధులు లేదా పాఠశాలలు https://hcljigsaw.com/ వద్ద 31 జూలై 2023 లోపుగా నమోదు చేసుకుని పోటీలో పాల్గొనవచ్చు. మొత్తంమ్మీద 12 లక్షల రూపాయలను విజేతలకు బహుమతులుగా అందజేస్తారు. దీనితో పాటుగా హెచ్సీఎల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వద్ద అభ్యసించే అవకాశమూ లభిస్తుంది. ప్రతి ఫైనలిస్ట్కూ 15 వేల రూపాయల విలువైన బహుమతి అందజేస్తారు.
ఈ కార్యక్రమం గురించి బ్రాండ్ హెచ్సీఎల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–రజత్ చందోలియా మాట్లాడుతూ ‘‘ హెచ్సీఎల్ వద్ద మేము కేవలం వ్యక్తుల సామర్ధ్యం పెంపొందించడం మాత్రమే కాదు మొత్తంమీద సమాజం యొక్క సామర్ధ్యం పెంచాలనుకుంటున్నాము. మన విద్యా వ్యవస్ధ భావితరం జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారించింది. క్రిటికల్గా ఆలోచించడంతో పాటుగా సమస్యలనూ పరిష్కరించాల్సి ఉంది. అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో యువ హృదయాలు విజయం సాధించాలంటే క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. జిగ్సా అదే చేస్తుందిప్పుడు. జిగ్సా మొదటి మూడు ఎడిషన్లకు సానుకూల స్పందన లభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. దేశవ్యాప్తంగా 50వేల మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు. మన దేశపు యువ మేధావులు పంచుకున్న ఆలోచనలు , పరిష్కారాలు వినూత్నంగా ఉండటంతో పాటుగా మమ్మల్ని ఎంతగానో ఆనంద పరిచాయి. ఇప్పుడు జిగ్సా తమ నాల్గవ ఎడిషన్తో రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ సారి ఈ యువ మేధావులు అందించే పరిష్కారాలను వినడానికి ఆసక్తిగా చూస్తున్నాను. భవిష్యత్లో ఈ తరహా ఈవెంట్లు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు.
హెచ్సీఎల్ జిగ్సా , విద్యార్ధులను ఈ దిగువ ప్రతిష్టాత్మక అంశాలతో పరిశీలిస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈ 10అంశాలపై విద్యార్ధుల ప్రతిభను అంచనా వేస్తుంది. వాటిలో...
- పరిశోధనా నైపుణ్యాలు – ఇది విద్యార్థులు ఎంత నైపుణ్యంతో ఓ సమస్యను విశ్లేషించగలుగుతున్నారు, పరిశోధన/కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు మరియు సమాచారం సేకరించి నిర్వహిస్తున్నారనేది పరిశీలిస్తారు.
- కమ్యూనికేషన్ ప్రక్రియ – ఒక పొందికైన పద్ధతిలో సమాచారాన్ని రూపొందించడంలో విద్యార్ధి సామర్థ్యాన్ని మరియు సమాచార నేపథ్యం మరియు అవగాహనను అర్థం చేసుకోవడాన్ని పరిశీలించడం.
- విమర్శనాత్మకంగా ఆలోచించడం – ఈ లక్షణం సమాచారాన్ని సరిగా అర్ధం చేసుకోవడానికి విద్యార్ధి సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి, సమాచారాన్ని సంశ్లేషణ చేయడం మరియు తీర్మానాలను చేయడం,క్లెయిమ్లను పరిశీలించడం
హెచ్సీఎల్ జిగ్సా అనేది వర్ట్యువల్ పోటీ ; దీనిలో మూడు ఎస్సెస్మెంట్ దశలు/రౌండ్లు ఉన్నాయి :
- క్వాలిఫయర్స్ రౌండ్ (ఒలింపియాడ్ రౌండ్) – 40 నిమిషాల దేశవ్యాప్త ఒలింపియాడ్ను ఏప్రిల్ 03,2023 నుంచి జూలై 31, 2023 వరకూ నిర్వహిస్తారు.
- ఈ రౌండ్ నుంచి విద్యార్ధులందరూ వ్యక్తిగతీకరించిన స్కిల్ ఎస్సెస్మెంట్ నివేదికను తమ పెర్ఫార్మెన్స్కు సంబంధించి ప్రతి నైపుణ్యంపై పొందుతారు. వీరికి మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు, డెవలప్మెంట్
- క్వాలిఫయర్స్ నుంచి ప్రతి గ్రేడ్లోనూ 20 % విద్యార్థులను సెమీ ఫైనల్స్కు ఎంపిక చేస్తారు
సెమీఫైనల్స్ (భాగస్వామ్యం మరియు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస రౌండ్) – భాగస్వామ్య మరియు ప్రాజెక్ట్ ఆధారిత రౌండ్ ఆగస్టు 18, 2023 నుంచి ఆగస్టు 20, 2023 వరకూ జరుగుతుంది.
- ఎంపికైన అభ్యర్ధులను ముగ్గురు చొప్పున టీమ్లుగా విభజిస్తారు మరియు వీరు ప్రాజెక్ట్ ఆధారిత సవాల్లో అందించిన నేపథ్యానికి అనుగుణంగా పోటీపడతారు
- ఈ రౌండ్లో టాప్ 5 గ్రూప్లు ఫైనల్కు వెళ్తాయి
- ఫైనల్ (గ్రూప్ జ్యూరీ ప్రెజెంటేషన్ రౌండ్ ) – ఆగస్టు 26, 2023 మరియు ఆగస్టు 27,2023న జ్యూరీ ప్రెజంటేషన్ రౌండ్ జరుగుతుంది.
- విద్యార్ధులకు వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే ఓ సమస్యను విభిన్న నేపథ్యానికి అనుగుణంగా అందిస్తారు. వీరు పరిష్కారాన్ని న్యాయనిర్ణేతల బృందం ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది.
- అన్ని గ్రేడ్ల నుంచి మొత్తంమ్మీద 60 మంది విద్యార్థులు ఈ దశలో పోటీపడతారు. ప్రతి గ్రేడ్ నుంచి టాప్ 3 విద్యార్థులు ఇండియాస్ టాప్ యంగ్ ప్రాబ్లమ్ సాల్వర్ టైటిల్ గెలుచుకుంటారు.
దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలోని 3వేలకు పైగా పాఠశాలలకు చెందిన 50వేల మంది విద్యార్థులు హెచ్సీఎల్ జిగ్సా మొదటి మూడు సంచికలలో పాల్గొన్నారు. విజేతలు బెంగళూరు, చెన్నైలలోని హెచ్సీఎల్ ఇన్నోవేషన్ ల్యాబ్లను సందర్శించారు.
గమనించవలసిన ముఖ్యమైన తేదీలు
క్వాలిఫైయర్లు : ఏప్రిల్ 03, 2023 - జూలై 31 2023
సెమీ ఫైనల్ : ఆగస్టు 18,2023 - ఆగస్టు 20 2023
ఫైనల్ : ఆగస్టు 26, 2023 - ఆగస్టు 27 2023