Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమణాచారికి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఎస్సీ-98 అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాల హామీ గురించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారికి డీఎస్సీ సాధన సమితి అధ్యక్షులు కె శ్రీనివాస్ నేతృత్వంలో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో 4,534 మంది డీఎస్సీ-98 అర్హత పొందిన అభ్యర్థులకు ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో తెలంగాణలోని డీఎస్సీ-98 అభ్యర్థులందరికీ ఉద్యోగాలిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.