Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణాదికి చెందిన ఐకెఎఫ్ ఫైనాన్స్ రూ.250 కోట్ల నిధులు సమీకరించినట్లు ప్రకటించింది. అక్సియన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ నేతృత్వంలో ఫండింగ్ రౌండ్లో ఈ మొత్తాన్ని సేకరించినట్లు తెలిపింది. నిధుల తోడ్పాటులో మార్య్చు హెచ్ఎన్ఐ, కుటుంబ కార్యాలయాలు మద్దతును అందించాయని పేర్కొంది. ఈ మూలధనం ఎంచుకున్న భౌగోళిక ప్రాంతాలలో మా పంపిణీ నెట్వర్క్ ను మరింత లోతుగా ఇంకా విస్తరించడం ద్వారా కంపెనీ వృద్థి ఆశయా లకు మద్దతు ఇస్తుందని ఐకెఎఫ్ ఫైనాన్స్ ఎండి వసుమతి కోగంటి పేర్కొన్నారు.