Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ దేశంలో 3000 పైగా నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చి నట్టు గురువారం ప్రకటించింది. ఇక జమ్మూలోని కత్రా నుంచి కేరళలోని కన్నూర్ వరకు, బీహార్లోని పాట్నా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి, ఇటా నగర్ నంచి డామన్ డయ్యూ వరకు అనేక నగరాల్లో తమ అపరిమిత 5జీ సేవలను పొందవచ్చని పేర్కొంది. '2023 సెప్టెంబర్ నాటికి ప్రతీ పట్టణం, కీలక గ్రామాలకు తమ 5జీ సేవలను విస్తరించనున్నాము. ప్రతీ రోజు 30-40 నగరాల్లో కొత్తగా 5జి సేవలను ప్రారంభిస్తున్నాం' అని భారతీ ఎయిర్టెల్ సీటీఓ రందీప్ సెఖోన్ తెలిపారు.