Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతీ ఆర్డర్పై ప్లాట్ఫామ్ ఫీజు పేరుతో కొత్తగా అదనపు ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్పై అదనంగా రూ.2 రుసుం వసూలు చేయనుంది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరా బాద్ నగరాల్లో ఇది అమల్లోకి వచ్చింది. త్వరలోనే ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్విగ్గీ ప్రతీ రోజు 15 లక్షల పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. దీంతో ప్రతీ వినియోగదారుడిపై రూ.2 వసూలు చేసిన రోజుకు అదనంగా రూ.30 లక్షల ఆదాయం సమకూ రనుంది. ఫుడ్ డెలివరీలు తగ్గడం, దీర్ఘకాలంలో నగదు నిల్వలు పెంచుకో వడానికి ఈ నిర్ణయం దోహదం చేయనుందని ఆ సంస్థ భావిస్తోంది.