Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రిటానియా మేరీ గోల్డ్ మై స్టార్టప్ సీజన్ 4.0లో 10 మంది మహిళా ఔత్సాహిక వేత్తలకు కోటి రూపాయల సీడ్ ఫండ్ను అందించినట్టు ఆ సంస్థ తెలిపింది. మహిళలు వ్యాపారాలను ప్రారంభించేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం చేసినట్టు పేర్కొంది. ఈ సీజన్లో 20 లక్షలకు పైగా ఔత్సాహిక మహిళలు ఆసక్తిని కనబర్చారని తెలిపింది. వ్యాపార నైపుణ్యాల శిక్షణా కార్యక్రమంతో ఇప్పటి వరకు 80,000 మంది సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించింది.