Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సి బ్యాంక్, ప్లాట్ఫారమ్ (DDP)- ‘హెచ్డీఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ సాథీ’ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది పటిష్టంగా, డిజిటల్గా నిర్మించబడిన అత్యాధునిక పరిష్కారమైన డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఎనేబుల్డ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ తన వినియోగదారులు అందరికీ సురక్షితమైన, వినియోగదారు-స్నేహపూర్వక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రయోగం వృద్ధి చెందుతున్న తన వినియోగదారుల అవసరాలను పరిష్కరించే వినూత్న పరిష్కారాలను అందించే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ బిజినెస్ కరస్పాండెంట్లు (BCs) మరియు బిజినెస్ ఫెసిలిటేటర్స్ (BFs)ని బ్యాంక్కి అనుసంధానం చేసేందుకు అధునాతన సాంకేతిక పరిష్కారాలను వినియోగించుకుంటుంది. ఈ నెట్వర్క్ ద్వారా బిజినెస్ కరస్పాండెంట్లు మరియు బిజినెస్ ఫెసిలిటేటర్లు బ్యాంకింగ్ ఉత్పత్తులను, సేవలను మారుమూల ప్రాంతాతలలో ఉన్న వినియోగదారుని వరకు తీసుకు వెళ్లడం ద్వారా ఆర్థిక ఇంక్లూజన్ను పెంచేందుకు అనుమతిస్తుంది. సెమీ అర్బన్ మరియు రూరల్ ఎకోసిస్టమ్ గురించి బ్యాంక్ ఇప్పటి వరకు నిర్వహించిన సుదీర్ఘమైన అభ్యాసం ద్వారా ఈ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం కలిగింది. ‘హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ సాథీ’ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మరియు ప్రభుత్వ, ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, ఆల్టర్నేట్ బ్యాంకింగ్ ఛానెళ్లు, పార్ట్నర్షిప్లు, ఇన్క్లూజివ్ బ్యాంకింగ్ గ్రూప్ మరియు స్టార్ట్-అప్ల విభాగం హెచ్డీఎఫ్సీ బ్యాంకు గ్రూప్ హెడ్ స్మితా భగత్తో కలిసి ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సి బ్యాంక్ ఆర్థిక సేవల విభాగం జాయింట్ సెక్రటరీ ముఖేష్ బన్సాల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు శ్రీ దినేష్ లూత్రా మరియు అజయ్ శర్మ కూడా పాల్గొన్నారు.
‘‘ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫారాలు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, వాస్తవికతతో కలిగిన డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే భారతదేశ దృష్టి కోణాన్ని సాకారం చేసుందుకు దోహదపడతాయి. బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలను అందుబాటులో ఉంచేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్మార్ట్ సాథీ దోహదపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ వినియోగదారులకు క్రెడిట్ను అందిస్తూ, ఇది మన దేశ అభివృద్ధికి సహాయపడుతుంది. అయినప్పటికీ, నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భారతదేశం భారీ విజయాన్ని సాధించేందుకు మండీలలో లావాదేవీలు జరుపుతున్న రైతులు వంటి కొన్ని వినియోగదారుల విభాగాలలో ప్రవర్తనాపరమైన మార్పులు ఇంకా అవసరం. ఈ ప్రవర్తనా మార్పును తీసుకురావడంలో బిజినెస్ కరస్పాండెంట్లు సహాయపడతారు” అని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. “రానున్న 12 నుంచి 18 నెలల్లో మా శాఖలు, ఏజెంట్ నెట్వర్క్ల కలయికతో రెండు లక్షల గ్రామాలను చేరుకునేందుకు మేము ప్రణాళికను రూపొందించుకున్నాము. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ప్లాట్ఫారాన్ని ప్రారంభించడం కీలకమైన ముందడుగు. దాదాపు 70 శాతం మంది ప్రజలు నివసిస్తున్న గ్రామీణ భారతదేశం శ్రేయస్సును, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దార్శనికతను సాకారం చేయడంలో అంతర్భాగంగా ఉంది” అని ప్రభుత్వ, ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, ఆల్టర్నేట్ బ్యాంకింగ్ ఛానెళ్లు, పార్ట్నర్షిప్లు, ఇన్క్లూజివ్ బ్యాంకింగ్ గ్రూప్ మరియు స్టార్ట్-అప్ల విభాగం హెచ్డీఎఫ్సీ బ్యాంకు గ్రూప్ హెడ్ స్మితా భగత్ తెలిపారు. వ్యాపార కరస్పాండెంట్లు సాంప్రదాయకంగా ఖాతాలు తెరవడం, లావాదేవీలను నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్మార్ట్ సాథీ, మార్పును తీసుకువచ్చే కీలకమైన పరివర్తకునిగా, తన ఏజెంట్లు లోన్ ప్రొడక్ట్స్తో సహా 40కి పైగా బ్యాంకింగ్ ప్రొడక్ట్లు, సేవలను అందించేందుకు అనుమతిస్తుంది. ఇది ఏజెంట్లకు మెరుగైన ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. వినియోగదారులు సులభంగా రుణాలను అందుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ఫారమ్ ఏజెంట్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తూనే, వినియోగదారులకు ఆర్థిక అక్షరాస్యతను పెంచుతుంది.