Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరిక గుర్తునూ రద్దు చేయాలి
- పొగాకు రైతుల డిమాండ్
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
దేశంలో పొగాకు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు అశాస్త్రీయంగా, అసంబద్దంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (ఎఫ్ఎఐఎఫ్ఎ) ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకుకు ఉత్పత్తులపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరు భారీ అక్రమ రవాణకు దారి తీస్తోందని పేర్కొంది. దీంతో దేశీయ పొగాకు పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటోందని స్పష్టం చేసింది. ఫిక్కీ అధ్యయనం ప్రకారం 2007లో అక్రమ, కాంట్రాబ్రాండ్ సిగరేట్స్ 1 శాతం మాత్రమే ఉండేవని తెలిపింది. ప్రస్తుత ఈ అక్రమ రవాణ 21 శాతం వాటాను అక్రమించాయని, దీంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.9,000 కోట్ల నష్టం జరుగుతుందని ఎఫ్ఎఐఎఫ్ఎ తెలిపింది. ప్రతి ఏడాది ఈ స్మగ్లింగ్ 31 శాతం చొప్పున పెరుగుతుందని, ఇలాగే సర్కార్ చూసి చూడనట్లు వ్యవహరిస్తే 50 శాతానికి చేరిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. భారత్లో పొగాకు ఉత్పత్తిని ప్రతి ఏడాది ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోందని కన్సోరియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్ అసోసియేషన్ ఛైర్మన్ చంగల్ రెడ్డి అన్నారు. దీనికి తాము వ్యతిరేకం కాదని, అయితే తమకు ప్రత్యామ్నాయ పంటలను చూపిస్తే సరిపోతుందన్నారు. కాని ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. ప్రస్తుతం దేశంలో పప్పులు, ఉల్లి ఇతర నిత్యావసర ఉత్పత్తుల ధరలు ఎగిసిపడుతున్నాయన్నారు.