Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
ఎన్ఎండిసి ఛైర్మన్కు టాటా గోల్డ్ మెడల్ దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్ఎండిసి కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) నరేంద్ర కొఠారీ ప్రతిష్టాత్మకమైన టాటా గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారు. కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెటల్స్ 2015లో కొఠారీకి ఈ పురస్కారం దక్కింది. ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెటల్స్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ మోహంతి ఈ అవార్డును కొఠారీకి అందజేశారు. సంస్థ ఉత్పత్తిలో ఆయన చూపిన ప్రగతి, కంపెనీ సామర్థ్యం పెంపునకు చేసిన కృషిలో భాగంగా ఈ అవార్డును అందించారు. భూగర్బ వనరుల రంగంలో ప్రత్యేక ప్రగతి, కృషిని కనబర్చిన వారికి ఈ అవార్డును అందజేస్తున్నారు.