Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
- సెన్సెక్స్-58, నిఫ్టీ-16 పాయింట్ల క్షీణత
ముంబయి: మే మాసపు డెరివెటీవ్లకు చివరి రోజు కావడం, ఆర్థిక, ఫార్మా రంగపు షేర్లలో అమ్మకాల ఒత్తిడి, ప్రధాన ఆసియా మార్కెట్లలో బలహీనత, నిరాశగొలిపే కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలకు తోడు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను పెంచవచ్చన్న ముందస్తు జాగ్రత్తల కారణంగా మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలలో ముగిశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 57.95 పాయింట్ల మేర కుంగి 27,506.71 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా సుమారు 16 పాయింట్ల మేర క్షీణించి 8,319 పాయింట్ల వద్ద నిలిచింది. మొత్తంగా చూస్తే మార్కెట్ విస్తృతి బలహీనంగా కనిపించింది. బీఎస్ఈలో 1406 షేర్లు కుంగాయి 1255 షేర్లు లాభాల్లో నడిచాయి. మరో 115 స్క్రిప్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. బీఎస్ఈ మొత్తం టర్నోవర్ రూ.2574 కోట్లుగా నమోదు అయింది. ఇది అంతకు ముందు సెషన్లో రూ.2869.66 కోట్లుగా ఉంది. బీఎస్ఈ లోని లోహ సూచీ (0.51%), ఆరోగ్య రంగ సూచీ (1.31%)లు పేలవంగా ట్రేడ్ అయ్యాయి. మరోవైపు మన్నికైన వినియోగదారుల సూచీ (1.31%), ఐటీ సూచీ (0.67%), టెక్ సూచీ (0.41%), ఎఫ్ఎంసీజీ సూచీ (0.20%), చమురు, గ్యాస్ సూచీ (0.17%), ఆటో సూచీ (0.12%), విద్యుత్తు సూచీ (0.03%) వృద్ధిని కనబరిచాయి. ఈ నెలలో గురువారం వరకు సెన్సెక్స్ దాదాపు 495.40 పాయింట ్ల(1.83%) మేర వృద్ధి చెందింది. రుతుపవనాల రాకకు పరిస్థితులు అనువుగా ఉన్నాయంటూ నివేదికలు రావడం మరోవైపు రూపాయి 15 పైసల మేర కోలుకొని రూ.63.86 చేరింది. ఈ అనుకూల పవనాలు మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టకుండా ఆదుకున్నాయి.