Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.550.56 కోట్ల లాభాలతో మాత్రమే సరిపెట్టుకుంది. 2014 మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.896.88 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్యూ4 లాభాల్లో ఏకంగా 38.61 శాతం క్షీణత చోటు చేసుకుంది. గత క్యూ4లో కంపెనీ నికర అమ్మకాలు 13.16 శాతం పడిపోయి రూ.9,411.52 కోట్లుగా నమోదయ్యాయి. గత మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఎంఅండ్ఎం నికర లాభాలు 32.77 శాతం కుంగి రూ.3,137.47 కోట్ల లాభాలకు పరిమితమయ్యింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.4,666.93 కోట్ల లాభాలు సాధించింది. 2014-15లో కంపెనీ నికర అమ్మకాలు 2.69 శాతం తగ్గి రూ.70,797.87 కోట్లుగా నమోదయ్యాయి.