Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఎన్టిపిసి క్రితం ఆర్ధిక సంవత్సరం (2014-15) జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 4.8 శాతం క్షీణతతో రూ.2,944 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. 2013-14 ఇదే క్యూ4లో రూ.3,093.54 కోట్ల లాభాలు సాధించింది. గత క్యూ4లో ఎన్టిపిసి నికర అమ్మకాలు 8.1 శాతం పడిపోయి రూ.19,314 కోట్లుగా నమోదయ్యాయి.
క్రితం ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రతి షేర్పై రూ.2.50 డివిడెండ్ అందించాలని నిర్ణయించింది. ఇందులో గత ఫిబ్రవరిలోనే రూ.0.75 చెల్లించింది. మరో రూ.1.75 చెల్లించడానికి శుక్రవారం బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్టిపిసి ప్రస్తుతం 44,598 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 2014-15లో ఎన్టిపిసి మొత్తం నికర లాభాలు 6.2 శాతం తగ్గి రూ.10,290.86 కోట్లుగా నమోదయ్యాయి.