Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28000 స్థాయిని దాటిన సెన్సెక్స్
ముంబయి: గ్రీసు సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చినట్లేనన్న వార్తలు రావడం, మే మాసంలో ఎనిమిది కీలక రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉందంటూ వెలువడిన గణాంకాలు, సాధరాణం కంటే మెరుగైన వర్షపాతమే నమోదు అయిందన్న వాతావరణ శాఖ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 240 పాయింట్ల మేర ఎగిసి 28000 స్థాయిని దాటి 28,020 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా దాదాపు 84 పాయింట్ల లాభంతో 8450 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్ విస్తృతి బలంగా కనిపించింది. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.4 శాతం వృద్ధిని కనబరిచాయి. బీఎస్ఈలో 1,877 షేర్లు లాభాల బాట పట్టాయి. 901 షేర్లు నష్టాలలో నిలిచాయి. డాలరుతో రూపాయి జోరు తగ్గింది. ఉదయం రూపాయి 63.64 వద్ద ట్రేడ్ అయింది. ఎఫ్ఎంసీజీ తప్ప అన్ని రంగాల సూచీలు లాభాలలోనే నిలిచాయి. బ్యాకింగ్, ఆటో, యంత్రపరికరాల షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమకూర్చుతామని కేంద్రం మరోసారి హామీ ఇవ్వడంతో బ్యాంకింగ్ షేర్లకు మద్దతు లభించింది. చివరిగా మార్కెట్లు ఆరు వారాల గరిష్ఠ స్థాయిలో ముగియడం విశేషం.