Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ శనివారం మార్కెట్లోకి మరోకొత్త సెడాన్ కారును విడుదల చేసింది. టిగోర్ ఎక్స్ఎం పేరుతో ఈ కొత్త వేరియంట్ను సంస్థ అందు బాటులోకి తీసుకువచ్చింది. టిగోర్ ఎక్స్ఎం పెట్రోలు ఇంజిన్ కారు ధరను కంపెనీ రూ.4.99 లక్షలుగా (ఎక్స్షోరూమ్-ఢిల్లీ) నిర్ణయించింది.ఈ కారు 1.2 లీటరు- పెట్రోలు, 1.0 లీటరు-ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లలోకి రానుంది. అయిదు-స్పీడ్లతో కూడిన మ్యానువల్ గేర్లు, మొత్తం విండోస్కు పవర్ విండో సౌకర్యం, స్పీడ్-సెన్సిటీవ్ ఆటో డోర్లాక్స్, హోమ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫ్యూయల్ గేజ్, ఫుల్ ఫ్యాబ్రిక్ సీట్లు, ఇంటీరియర్ ల్యాంప్ విత్ డిమ్మింగ్ ఫంక్షన్, ఫుల్ వీల్ కవర్స్తో దీనిని రూపొందించడం విశేషం.