Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో హై-సెక్యూరిటీ ఉపకరణాల ఏర్పాటు
న్యూఢిల్లీ: పెట్రోల్, గ్యాస్ బంకుల్లో అక్రమాలను నియంత్రించేందుకు గాను సర్కారు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇంధనం, గ్యాస్ నింపడంలో అక్రమాలను కట్టడి చేసేందుకు.. ఇంధన డెలివరీలో ఖచ్చితత్వానికి గాను త్వరలో బంకుల్లో హై-సెక్యూరిటీతో కూడిన మూడు ఉపకరణాలను బిగించనున్నారు. వీటిని అమర్చేందుకు గాను చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ఆమోదించాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త సెక్యురిటీ డివైజ్లను ఏర్పాటు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే వారం వరకు ప్రభుత్వం గడువు విధించింది. 'ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ స్టేషనలలో సెక్యురిటీ డివైజ్లను ఉన్నాయి. కానీ.. వాటిల్లో అవకతవకలకు ఎక్కువగా అవకాశం ఉండటం.. అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో కొత్త వాటితో ఈ డివైజ్లను మార్చుతున్నాం' అని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఫ్లో మీటర్స్, టాంపర్-ప్రూఫ్ ఎలక్ట్రానిక్ సీల్స్, పల్సర్లను చమురు మార్కెటింగ్ సంస్థలు ఏర్పాటు చేస్తే.. తూనిఖలు, కొలతల శాఖ వీటి పని తీరును పరీక్షించనున్నట్టుగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.