Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగినట్టుగా సర్కారు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2017-18) తొలి ఐదు మాసాల కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17.5 శాతం పెరిగి రూ.2.24 లక్షల కోట్లకు చేరాయని ఆర్ధిక శాఖ వెల్లడించింది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపులు పెరిగాయని పేర్కొ ంది. మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది 22.9 శాతంగా ఉంది. 2017 -18లో మొత్తంగా రూ.9.80 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూళ్లు అవుతాయని కేంద్రం అంచనా వేసింది. ఈ పన్ను వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయని ఆర్ధిక శాఖ పేర్కొంది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో 16 శాతం, కార్పొరేట్ పన్నుల్లో 5 శాతం పెరుగుదల నమోదయ్యింది. 2016-17 ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.03 శాతం పెరిగి రూ.1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.