Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) మార్కెట్లోకి 'జీతో' మినీ వ్యాన్ను విడుదల చేసింది. పట్టణ, చిన్న పట్టణ ప్రాంతాల రవాణను లక్ష్యంగా చేసుకుని దీన్ని ఆవిష్కరించింది. ఇందులో జీఎన్జీ, పెట్రోల్ వర్షన్లోనూ అందుబాటు లోకి తెచ్చే యేచనలో ఉన్నామని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అరవపల్లి అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆ కంపెనీ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ కులకర్నీతో కలిసి శ్రీనివాస్ మాట్లాడుతూ బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశామన్నారు. ఈ వాహనం లీటర్కు 26 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని వివరించారు. హైదరాబాద్ ఎక్స్షోరూం వద్ద దీని ధర రూ.3.34 లక్షలు.